Friday, October 24, 2025
spot_img

వరుసగా 3వ రోజూ నష్టాలే

Must Read

ఇండియన్ స్టాక్‌ మార్కెట్లు వరుసగా 3వ రోజూ (జూన్ 3, మంగళవారం) నష్టాలను చవిచూశాయి. ఫారన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద సంఖ్యలో వెనక్కి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు షేర్ మార్కెట్లను నష్టాల బాటలోకి తీసుకెళ్లాయి. ఇంధనం, ఆర్థికం, ఐటీ రంగ షేర్లలో సేల్స్ పెరగటంతో ఒక దశలో ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి. కాకపోతే.. ట్రేడింగ్ సెషన్ చివరలో ఈ నష్టాలను కాస్త తగ్గించుకోగలిగాయి.

ఇంట్రాడేలో 800 పాయింట్ల వరకు లాసైన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌.. ట్రేడింగ్ ముగిసే టయానికి 636.24 పాయింట్లు కోల్పోయింది. తద్వారా 80,737.51 వద్ద ఆగింది. నిఫ్టీ 174.10 పాయింట్లు తగ్గి 24,542.50 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 2,266 సూచీలు నష్టపోగా 1,731 సూచీల్లో పెరుగుదల కనిపించింది. గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్ అయ్యాయి. డాలర్‌ వీక్ అవటం కూడా సూచీల పతనానికి కారణమని దలాల్‌ స్ట్రీట్ వర్గాలు తెలిపాయి. ఎస్‌ బ్యాంక్‌ షేరు భారీగా పతనమైంది. ఏకంగా 10.40 శాతం నష్టపోయింది.

ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కాైర్లెల్‌ గ్రూపు ఎస్‌ బ్యాంక్‌లోని తన వాటాను 2.6 శాతం విక్రయిస్తున్నట్లు ప్రకటించడం బ్యాంక్‌ షేరుపై భారీ ప్రభావం చూపింది. అదానీ గ్రూపు షేర్లు కూడా భారీగానే దెబ్బతిన్నాయి. అదానీ పోర్ట్‌ అత్యధికంగా 2.42 శాతం, ఎన్‌డీటీవీ 2.25 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ 2.18 శాతం, అదానీ పవర్‌ 2.02 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 1.89 శాతం నేలచూపులు చూశాయి. అదానీ టోటల్‌ గ్యాస్‌ 1.62 శాతం, అదానీ గ్రీన్‌ 1.58 శాతం, సంఘీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ 1.16 శాతం, అంబుజా సిమెంట్‌, ఏసీసీ, ఏడబ్ల్యూఎల్‌ అగ్రి బిజినెస్‌ షేర్లు దెబ్బతిన్నాయి.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This