తూంకుంట మునిసిపాలిటీ ఆఫీసులో బిల్ కలెక్టర్గా చేస్తున్న కె.రామ్రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్గా వ్యవహరిస్తున్న ఎ.శ్రావణ్ అవినీతి అధికారులకు చిక్కారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఇంటికి సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు రామ్రెడ్డి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆ మొత్తాన్ని శ్రావణ్ ద్వారా చేజిక్కించుకునే సమయంలో పట్టుబడ్డాడు. రామ్రెడ్డి శామీర్పేట వార్డ్ ఆఫీసులో బిల్ కలెక్టర్గా చేస్తున్నాడు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు.
