Saturday, June 7, 2025
spot_img

తూంకుంట మునిసిపాలిటీలో ఏసీబీకి చిక్కిన ఇద్దరు లంచావతారులు

Must Read

తూంకుంట మునిసిపాలిటీ ఆఫీసులో బిల్‌ కలెక్టర్‌గా చేస్తున్న కె.రామ్‌రెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌గా వ్యవహరిస్తున్న ఎ.శ్రావణ్‌ అవినీతి అధికారులకు చిక్కారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఇంటికి సంబంధించిన మ్యుటేషన్‌ ప్రక్రియను పూర్తిచేసేందుకు రామ్‌రెడ్డి డబ్బులు డిమాండ్‌ చేశాడు. ఆ మొత్తాన్ని శ్రావణ్‌ ద్వారా చేజిక్కించుకునే సమయంలో పట్టుబడ్డాడు. రామ్‌రెడ్డి శామీర్‌పేట వార్డ్‌ ఆఫీసులో బిల్‌ కలెక్టర్‌గా చేస్తున్నాడు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు.

Latest News

కోహ్లీని అరెస్ట్ చేయాలి

ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్‌ బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాట సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఆ జట్టులోని స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీని అరెస్ట్‌ చేయాలని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS