Saturday, October 4, 2025
spot_img

రూ.14 వేల కోట్లతో RGIA విస్తరణ

Must Read

శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (RGIAని) విస్తరించాలని ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ యోచిస్తోంది. RGIA నిర్వహణను జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ చూస్తోంది. విస్తరణ కోసం మూడేళ్లలో రూ.14 వేల కోట్లను ఖర్చుచేయనుంది. ఈ మేరకు ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్‌లో తెలిపింది. ప్రస్తుతం ఉన్న టెర్మినల్‌ను విస్తరించడంతోపాటు మరో టెర్మినల్‌, రన్‌వేను డెవలప్ చేయనున్నారు.

2026-27లో ఈ పనులను ప్రారంభించి 2029 సెప్టెంబర్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్జీఐఏను ఏటా 3.4 కోట్ల మంది ప్రయాణికుల కోసం, గంటకు 42 ఫ్లయిట్ల రాకపోకల కోసం నిర్మించారు. 2017-18లో 1.83 కోట్లుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య ఏటా 7.1 శాతం వృద్ధి రేటుతో గత ఆర్థిక సంవత్సరంలో 2.95 కోట్లకు పెరిగింది. విమానాల సంఖ్య గంటకు 36కు చేరింది. దీంతో ఎయిర్‌పోర్టు త్వరలోనే మ్యాగ్జిమమ్ కెపాసిటీకి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో విస్తరణ అవసరం ఏర్పడింది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This