Friday, October 3, 2025
spot_img

ప్రధాని మోదీని కలుద్దాం రండి

Must Read

అన్ని పార్టీల్లోని బీసీ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు

బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీలకు మద్దతు గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను కలిసి మాట్లాడటం సరికాదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆమె బలహీన వర్గాల గురించి మాట్లాడి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీసీ విజన్‌పై పార్లమెంట్ సాక్షిగా బల్లగుద్ది చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణలో బీసీలు 56 శాతం మంది ఉన్నారనేది వాస్తవమని తెలిపారు. తమతో ఎవరైనా కలిసి రావచ్చని, రాజకీయాలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీని కలుద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This