Friday, July 18, 2025
spot_img

బలూచి లిబరేషన్‌ దాడులు

Must Read
  • వరుస ఘటనలతో పాక్‌ సైన్యం ఉక్కిరిబిక్కిరి
  • రెండ్రోజుల్లో 27మంది సైనికుల హతం

బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ పాకిస్థాన్‌ సైన్యానికి ఊపిరి సలుపనివ్వడం లేదు. వరుస దాడులతో విరుచుకు పడుతున్నారు. గత రెండ్రోజుల్లో 27 మంది పాక్‌ సైనికులను మట్టుపెట్టినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఓ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. బీఎల్‌ఏకు చెందిన ఫతే స్క్వాడ్‌ కలాత్‌లోని నిమ్రాగ్‌ క్రాస్‌ వద్ద సైనికులను తరలిస్తున్న ఓ బస్సును లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. ఇందులో 27 మంది సైనికులు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సు కరాచీ నుంచి క్వెట్టాకు దళాలను తరలిస్తుండగా ఈ దాడి చోటు చేసుకొంది. మరో ఘటనలో క్వెట్టాలోని హజార్‌గంజ్‌లో ఐఈడీ పేల్చి మరో ఇద్దరు సైనికులను హతమార్చినట్లు బీఎల్‌ఏ వెల్లడించింది.

మంగళవారం కలాత్‌లోని ఖజినా ప్రాంతంలో మరో ఐఈడీ పేల్చి నలుగురు సైనికులను , బుధవారం గుజ్రోకొర్‌ ఏరియాలో దాడి చేసి మరో ఆరుగురు సైనికులను హత్య చేసినట్లు బీఎల్‌ఏ ప్రకటించింది. వీరిలో మేజర్‌ సయిద్‌ రబ్‌ నవాజ్‌ తరీక్‌ కూడా ఉన్నట్లు చెప్పింది. సమీపంలోని సైనిక కాన్వాయ్‌ను స్నైపర్లు లక్ష్యంగా చేసుకోవడంతో.. ఆ కాన్వాయ్‌ అక్కడినుంచి వెళ్లిపోయింది.

ఇక ముగ్గురు బీఎల్‌ఏ దళ సభ్యులు చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఖండించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ బలోచ్‌ రెబల్స్‌ మొత్తం 286 దాడులు చేశారు. ఈ క్రమంలో వివిధరకాల వ్యూహాలను అమల్లోకి తెచ్చారు. వీటిల్లో మూడు ఆత్మాహుతి దాడులు ఉన్నాయి. బీఎల్‌ఏ చేసిన మొత్తం దాడుల్లో 700 మందికి పైగా చనిపోయారు. 290 మందిని అదుపులోకి తీసుకొన్నట్లు బీఎల్‌ఏ చెబుతోంది. ఈ క్రమంలో 133 వాహనాలను లక్ష్యంగా చేసుకొంది. ఏకంగా ఓ రైలునే హైజాక్‌ చేసింది. దీంతోపాటు ఈ ఏడాది మొత్తం 45 వ్యూహాత్మక ప్రాంతాలను పాక్‌ నుంచి స్వాధీనం చేసుకొన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Latest News

అదరగొట్టిన భారత మహిళల జట్టు

ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో విజయం సౌథాంప్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS