Friday, April 11, 2025
spot_img

జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్,నలుగురు ఉగ్రవాదులు హతం

Must Read

జమ్మూకశ్మీర్ లో బుధవారం ఉగ్రవాదులు,భద్రతా బలగాల మధ్య మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది.మంగళవారం ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఉదంపూర్ లో భద్రతా బలగాలు కుంబింగ్ నిర్వహించాయి.ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాల పై కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు సమీపంలో ఉన్న అడవిలోకి పారిపోయారు.దింతో గాలింపు చర్యలను ముమ్మరం చేసిన భద్రతా బలగాలపై శివ్ గఢ్-అస్సార్ ప్రాంతంలో మరోసారి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో 48వ రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఓ ఆర్మీ క్యాప్టెన్ అమరుడయ్యాడు.బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారని అధికారులు వెల్లడించారు.

మరోవైపు గురువారం స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సైన్యం అప్రమత్తమైంది.ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందనే నిఘా వర్గాల సమాచారంతో పెద్దఎత్తున బలగాలను మోహరించారు.

Latest News

ఆటగాళ్లను రిటైర్డ్‌ ఔట్‌గా పంపడమేంటి?

టీమిండియా మాజీ క్రికెటర్‌ కైఫ్‌ అసహనం ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ఆటగాళ్లను రిటైర్డ్‌ ఔట్‌గా బయటకు పంపించాడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌ తప్పు బట్టాడు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS