Friday, October 3, 2025
spot_img

ఛత్తీస్‎గఢ్‎లో ఎన్‎కౌంటర్..10 మంది మావోయిస్టులు మృతి

Must Read

ఛత్తీస్‎గఢ్ లో మరోసారి భారీ ఎన్‎కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. మరణించిన 10 మందిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

ఒడిశా నుండి ఛత్తీస్‎గఢ్ సరిహద్దులోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందడంతో శుక్రవారం తెల్లవారుజామున భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. భద్రత బలగాలను గమనించిన మావోయిస్టులు ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రత బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఎన్‎కౌంటర్ అనంతరం 10 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలంలో ఇన్సస్, ఏకే 47, ఎస్.ఎల్.ఆర్ తో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This