డిప్యూటీ తాసిల్దార్ జావీద్ అరెస్ట్
నల్గొండ సివిల్ సప్లై కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల భరతం పడుతూనే ఉన్నారు. తాజాగా నల్లగొండలో పౌరసరఫరా ల శాఖ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ జావీద్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డివిజ న్ పరిధిలో అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తోన్న నాలుగు చక్రాల ఆటోలు, ట్రాలీలను పోలీసులు వల పన్ని మరీ పట్టుకున్నారు. సదరు రవాణా ఆటోలను అధికారు లు సీజ్ చేసి 6(ఏ) కేసులు నమో దు చేశారు.
ఈ క్రమంలోనే జిల్లాలోని మిర్యాలగూడ సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దార్ జావీద్ అయితే సివిల్ సప్లై శాఖ సీజ్ చేసిన వాహనాలను విడుదల చేసేందుకు జిల్లా పౌర సర ఫరాల శాఖ అధికారులతో కుమ్మకై బాధితుడు నుండి రూ.70 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఆ సందర్భంలోఅటు ఏసీబీకి, ఇటు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు చిక్కకుండా పరారీలో ఉండి తప్పించుకొని తిరుగుతున్న డిటిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇటీవల స న్షన్ చేయడంతో డిప్యూటీ తాసి ల్దార్ జావీద్ పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు సొంత శాఖ అధికారులపై ఏసీబీ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి జిల్లా కేంద్రంలోని జిల్లా కార్యాలానికి రమ్మించి ఏసీబీ అధికారులకు అప్పగించారు. దీంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఆ మేరకు డిప్యూటీ తహసిల్దార్ జావీద్ నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.