- అధికారిక వెబ్సైట్.. వాట్సాప్లో వెల్లడి
- ఫలితాలపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లోకేశ్
ఏపీలో శనివారం ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ రెండు సంవత్చరాల పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామన్నారు. విద్యార్థుల తమ ఫలితాలను ఆన్లైన్లో చూసుకోవచ్చునని తెలిపారు. మన మిత్ర వాట్స్ యాప్ నంబర్కు 9552300009లో కూడా ఫలితాలు తెలుసుకోవచ్చునని చెప్పారు. అందరికి మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు చెప్పారు. కాగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి1న ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. మార్చి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షల మూల్యాంకనం వేగంగా కొనసాంది. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తి చేశారు. ఆ తర్వాత ఫలితాలను కంప్యూటరీకరణ చేసేందుకు 5-6 రోజుల సమయం పట్టింది. తొలిరోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ భాషపై పరీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలు జరిగాయి. ఈ క్రమంలో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10.58 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు- చేసి ఆన్లైన్లో ఉన్నతాధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేశారు. పరీక్షా కేంద్రాలను ’నో మొబైల్ జోన్’గా ప్రకటించారు. ఈ సంవత్సరం టెన్త్, ఇంటర్ హాల్టికెట్లు విడుదల చేసినట్టుగానే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫలితాలు కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. అధికారిక వెబ్సైట్ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఇకపోతే తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 5న మొదలై 25వ తేదీతో ముగిసాయి. ప్రస్తుతం మూల్యాంకన పక్రియ వేగంగా కొనసాగుతోంది. ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు- తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారిక వర్గాల సమాచారం.