Wednesday, September 10, 2025
spot_img

తిరుపతిలో ప్రముఖ హోటల్స్‎కు బాంబు బెదిరింపులు

Must Read

తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. రాజ్ పార్క్ హోటల్‎, వైస్రాయ్ హోటల్‎ తో పాటు మరో రెండు హోటల్స్ కు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్‎ తో ఆయా హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఎక్కడ కూడా పేలుడు పదార్థాలు దొరకపోవడంతో, ఫేక్ మెయిల్స్‎గా పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా 04 రోజుల క్రితం కూడా ఈ నాలుగు హోటల్స్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి.తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఫేక్ మెయిల్స్ గా నిర్ధారించారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This