జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ రాష్ట్రానికి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, ముఖ్యమంత్రిగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా, సాహితీవేత్తగా, బహు భాషా వేత్తగా బూర్గుల రామకృష్ణారావు బహుముఖ ప్రజ్ఞ కనపర్చారని సీఎం కొనియాడారు. కార్యక్రమంలో నాగర్కర్నూల్, భువనగిరి ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.