Saturday, October 25, 2025
spot_img

రెపో రేట్‌ కోతపై రేపే నిర్ణయం

Must Read

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2025కి గాను 3వ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను నిన్న (జూన్ 4న బుధవారం) ప్రారంభించింది. ఇవాళ, రేపు కూడా జరగనున్న ఈ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను రేపు (జూన్ 6న శుక్రవారం) వెల్లడించనున్నారు. గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.

ఈసారి ద్రవ్య సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు, కుదిరితే 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే గత 2 ద్రవ్య సమీక్షల్లో (ఫిబ్రవరి, ఏప్రిల్‌) రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్ల చొప్పున మొత్తం 50 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టింది. దీంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. ఈ ఏడాది జరిగే మరో 3 ద్రవ్య సమీక్షల్లోనూ వడ్డీ రేట్ల తగ్గింపులకు అవకాశం ఉందని ఆర్థిక, బ్యాంకింగ్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This