Monday, August 18, 2025
spot_img

ఛత్తీస్‎గఢ్‎లో ఎన్‎కౌంటర్..10 మంది మావోయిస్టులు మృతి

Must Read

ఛత్తీస్‎గఢ్ లో మరోసారి భారీ ఎన్‎కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. మరణించిన 10 మందిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

ఒడిశా నుండి ఛత్తీస్‎గఢ్ సరిహద్దులోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందడంతో శుక్రవారం తెల్లవారుజామున భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. భద్రత బలగాలను గమనించిన మావోయిస్టులు ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రత బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఎన్‎కౌంటర్ అనంతరం 10 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలంలో ఇన్సస్, ఏకే 47, ఎస్.ఎల్.ఆర్ తో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Latest News

కార్లు, బైకులపై జీఎస్టీ తగ్గింపు

సామాన్యులకు కేంద్రం శుభవార్త పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని సొంత వాహనం కొనాలనుకునే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట రానుంది. కార్లు, ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS