బేబీ డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న “ఎర్రచీర – ది బిగినింగ్” చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తుండగా, దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రం మొదట శివరాత్రి కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే, సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు వేసవి సీజన్లో ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన ఎన్ వివి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, “ఈ చిత్రంలో క్లైమాక్స్ ఎపిసోడ్, అనేకమంది అఘోరాలతో శివుడిని అత్యద్భుతంగా చూపిస్తూ షూట్ చేసిన సీక్వెన్స్ అద్భుతంగా వచ్చిందని, కుటుంబం అంతా పిల్లలతో సహా చూసి ఆనందించదగ్గ సినిమా అని అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ, ” ఈ సినిమాలో 45 నిముషాలు పాటు ఉండే గ్రాఫిక్స్ చాలా హైలైట్ గా నిలుస్తాయి. సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారు. రిలీజ్ ఆలస్యం అయినా, కంటెంట్ మాత్రం ఖతర్నాక్గా ఉందని అందరూ అంటున్నారు. ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందని నమ్ముతున్నాం,” అని అన్నారు.
Must Read