Wednesday, October 22, 2025
spot_img

ఏపీకి వెళ్ళాల్సిందే, ఐఏఎస్ అధికారులకు షాకిచ్చిన క్యాట్

Must Read

కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ క్యాట్‎ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులపై క్యాట్ కీలక వ్యాఖ్యలు చేసింది. డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ వాకాటీ కరుణ, ఆమ్రపాలి, ఏ.వాణి ప్రసాద్ , డీ రోనాల్డ్ రాస్, జీ.సృజన కేంద్ర పరిపాలన ట్రైబ్యూనల్ ను ఆశ్రయించారు.

డీవోపీటీ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ లు దాఖలు చేసిన పిటిషన్లను క్యాట్ తొసిపుచ్చింది. డీవోపీటీ ఆదేశాలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే, అలాంటి చోటుకి వెళ్ళి సేవ చేయాలని లేదా అని ఐఏఎస్ అధికారులను క్యాట్ ప్రశ్నించింది. ఇంట్లో కూర్చొని సేవ చేస్తాం అంటే ఎలా అంటూ క్యాట్ నిలదీసింది. డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఏపీకి వెళ్ళాల్సిందేనని స్పస్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This