Saturday, October 4, 2025
spot_img

మానవత్వం చచ్చిపోయింది

Must Read

ఒక ఎమ్మెల్యే కన్నుమూశారు. ఆయన ఏ పార్టీ శాసన సభ్యుడు అనేది ముఖ్యం కాదు. ఆయన ఒక ప్రజా ప్రతినిధి. ఓ వైపు ఆ ఎమ్మెల్యే అంత్యక్రియలు జరుగుతున్నాయి. మరో వైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అది కూడా అంగరంగ వైభవంగా. సహచర శాసన సభ్యుడు చనిపోయిన విషయం తెల్లవారుజామునే తెలిసింది. అలాంటప్పుడు మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని ఓ మూడు రోజులు వాయిదా వేస్తే ఏం మునిగిపోతుంది? చనిపోయిన ఎమ్మెల్యే ప్రస్తుత ముఖ్యమంత్రితో గతంలో కలిసి పనిచేసిన నాయకుడు. ఆ మాత్రం కూడా గౌరవం లేదా? ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా విచారకరం. దురదృష్టకరం కూడా. దీన్నిబట్టి.. మానవత్వ విలువలు చచ్చిపోయాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

  • బీవీఆర్ రావు
Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This