- నచ్చింది చేస్తా.. నచ్చకుంటే తొలగిస్త..
- నేను తప్పు చేస్తే, నన్ను అడిగేవారే లేరు..
- రోజురోజుకు పెరిగిపోతున్న మెప్మా అధికారి అరాచకాలు.
- ఎక్కడ ఫిర్యాదు చేసిన, చివరగా నా దగ్గరికి రావాల్సిందే.
- పోలీస్ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్న రాణి..
- మెప్మా లోని అధికారి పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళలు.
ఈ సామ్రాజ్యానికి నేనే మహారాణి, నేను నచ్చిందే చేస్తాను.. నచ్చకుంటే తోసేస్తాను అనే విధంగా సూర్యాపేట మున్సిపాలిటీ మెప్మాలో ఓ అధికారి వ్యవహార శైలి అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. ఈ మహిళా అధికారిని కిందిస్థాయి ఉద్యోగులను ఏమాత్రం లెక్కచేయకుండా, అధికారులకు ఫిర్యాదు చేసిన ఐ డోంట్ కేర్ అంటూ, నన్ను ఎవరు ఏమి చేయలేరు మీరేం చేసుకుంటారో చేసుకోండి అని ఆర్పీల పట్ల మెప్మాలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుందని అదే కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ అధికారిని సంబంధిత శాఖ ఉన్నతాధికారులను తన చెప్పు చేతల్లో పెట్టుకుని, తన మాట వినని ఆర్పీలపై చాడీలు చెబుతూ, సంఘ బంధం డబ్బులను స్వాహా చేస్తుందని కొందరు అర్పిలు బహిరంగం గానే ఆరోపించారు. పొదుపు సంఘాల డబ్బులు సంబంధించిన విషయాలలో పోలీసు అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తూ, సంఘ బంధం మహిళలపై స్టేషన్ లో ఫిర్యాదు చేసి, వాళ్ళను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆర్పీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆమె చెప్తే ఎవరైనా వినాల్సిందే :
మెప్మా లోని మహిళ అధికారి ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. మే 24వ తేదీన తన్నీరు స్వరూప, మే 31 న మీలా లక్ష్మి పై, మెప్మా అధికారి ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఆ మహిళను తీసుకెళ్లి ఉదయం నుండి సాయంత్రం వరకు స్టేషన్ లోనే ఉంచి సాయంత్రం పూచికత్తిపై విడిచిపెట్టారు. ఆ మహిళకు హెల్త్ సమస్యలు ఉన్న అవేవి చూడకుండా పోలీసులు పొదుపు సంఘం విషయాల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆర్పీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో ఇప్పుడు పని చేస్తున్న చాలామంది ఆర్పీలకు అర్హత కూడా లేదని, కొందరు లెక్కలు కూడా చేయడం రాక ఇంట్లో ఉన్న వాళ్ళతో లెక్కలు చేయించుకుంటున్నారని, గతంలో పనిచేసిన ఆర్పిలు ఆరోపించారు.ఇప్పటికే కొందరు ఆర్పి ల దగ్గర నుండి డబ్బులు కట్టించుకొని, ఇబ్బందులకు గురి చేస్తున్న మహిళా అధికారిపై జిల్లా పోలీస్ అధికారి కి ఫిర్యాదు చేయగా,సూర్యాపేట సబ్ డివిజన్ కార్యాలయంలో ఇరువురిని పిలిచి మాట్లాడినట్లు తెలుస్తుంది.
ఓ ఆర్పి ఆవేదన :
పట్టణంలోని 44 వార్డు విద్యానగర్ ఎస్ఎల్ఎఫ్ టు లో పనిచేస్తున్న (చందన) ఆర్పి గత మూడు సంవత్సరాలుగా అనారోగ్య సమస్యతో బాధపడుతుండగా, 50,000 కట్టాల్సిన లోన్ డబ్బులకు, రూ .15 లక్షలుగా చిత్రీకరించి, రూ. 40 వేలు ఒకసారి, నాలుగు లక్షల రూపాయలు మరోసారి కట్టించుకొని, మానసికంగా వేధించి, బలవంతంగా నాతో బాకీ ఉన్నట్లు బాండ్ రాయించుకున్నారని ఆమె తెలిపారు.ఈ అధికారిని, తేజస్విని సంఘం ను, తేజ శ్రీ గా పేరు మార్చి ఆరున్నర లక్షల లోన్ ఎత్తారని అన్నారు. మున్సిపల్ కమిషనర్ 2021లో సంఘ బంధం అధ్యక్షురాలు, ఆర్పి, సిఓ ఎవరి సంతకాలు లేకుండానే ఒక కమిషనరే సంతకం చేసి లోన్ ప్రపోజల్ కు బ్యాంకు పంపించినట్లు ఆరోపించారు. ఆమాత్రం దానికి ఎస్ఎల్ఎఫ్ లు, ఆర్పీలు సంఘ బంధం అధ్యక్షురాలు ఎందుకు ఒక్కరే లోన్లు ఇప్పించొచ్చుగా అని అన్నారు. నేను ఒక సంఘంలో ఉంటే ఆ సంఘం బ్యాంక్ ఎకౌంట్ కు నా ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ పే క్రియేట్ చేస్తే, నాకు తెలియకుండానే అకౌంట్ లో ఉన్న నాలుగు లక్షల రూపాయలు డ్రా చేసుకున్నారని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మెప్మాలోని అధికారి అరాచకాలు, అక్రమాలు చాలానే ఉన్నాయని ముందు ముందు ఇంకెన్నో విషయాలు వెలుగులోకి వస్తాయని అప్పుడైనా అధికారులకు నిజా నిజాలు తెలుస్తాయని ఆమె మీడియా తెలిపారు.
మెప్మా లో అక్రమాలపై ప్రజాప్రతినిధులకు పిర్యాదు.?
మెప్మాలో మహిళా అధికారి వ్యవహరశైలి, జరిగిన అక్రమాలపై, మెప్మాలోని కొందరు మహిళ సిబ్బంది లెటర్ ను ప్రిపేర్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలో ఆ లెటర్ ను జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు,జిల్లా అధికారులకు అందించనున్నాట్లు విశ్వసనీయ సమాచారం.ఇన్ని రోజులు కొందరు ఆర్పిలు, కొందరు సంఘ బంధం అధ్యక్షురాలు మాత్రమే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో, కార్యాలయంలో పనిచేసిన మహిళలు బయటికి వచ్చి ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదు చేస్తే మరెన్నో అవినీతి అక్రమాలు బయటపడే అవకాశం లేకపోలేదు.