Saturday, October 4, 2025
spot_img

హుస్నాబాద్‌లో రోడ్డుల సమస్యపై వినూత్న నిరసన

Must Read

హుస్నాబాద్‌ పట్టణంలోని 14వ వార్డు రెడ్డి కాలనీలో నివాసులు బురద రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. స్థానికుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పలు కుటుంబాలు పాల్గొన్నాయి. స్థానికులు మాట్లాడుతూ.. పట్టణంలో శంకుస్థాపన చేసిన సీసీ రోడ్డు పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని, వెంటనే ఆ పనులను మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే 2వ వార్డు, 14వ వార్డుల్లో ఇప్పటికే నిర్మించిన కొన్ని సీసీ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, వాటిని తక్షణమే మరమ్మతు చేయాలని అధికారులు, పట్టణ అభివృద్ధి విభాగంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, రోడ్డు పనులు వాయిదా వేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This