Monday, March 31, 2025
spot_img

కూటమి సర్కార్‌ మరో కీలక నిర్ణయం

Must Read
  • విశాఖలో లూలూ గ్రూపునకు తిరిగి భూ కేటాయింపు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం హార్బర్‌ పార్క్‌ సవిూపంలో లూలూ గ్రూప్‌నకు గతంలో కేటాయించిన 13.83 ఏకరాలను తిరిగి ఆ గ్రూప్‌నకు ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. విశాఖపట్నంలో లూలూ గ్రూప్‌ నిర్మించనున్న షాపింగ్‌ మాల్‌, హైపర్‌ మార్కెట్ల నిర్మాణానికి భూమి కేటాయించాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టం చేసింది. అలాగే ఏపీఐఐసీ ద్వారా లూలూ గ్రూప్‌నకు విశాఖలో భూకేటాయింపులు చేయాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అదే విధంగా విశాఖ బీచ్‌ రోడ్‌లోని హార్బర్‌ పార్కులో ఉన్న 13.43 ఎకరాలను ఏపీఐఐసీకి బదలాయించాలని వీఎంఆర్డీఏకు ప్రభుత్వం ఆదేశించింది. విశాఖపట్నం నగరంలో లూలూ గ్రూప్‌ సంస్థ అంతర్జాతీయ స్థాయి మాల్‌ నిర్మాణం, పెట్టుబడులకు ఎస్‌ఐపీబీలో ఆమోదించినట్టు పరిశ్రమల శాఖ ఇప్పటికే వెల్లడించింది.

2017లోనే విశాఖ బీచ్‌ రోడ్‌లోని హార్బర్‌ పార్కులో అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు లూలూ గ్రూప్‌ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2023లో లూలూ గ్రూప్‌నకు గత ప్రభుత్వం చేసిన భూకేటాయింపులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం మళ్లీ షాపింగ్‌ మాల్‌తోపాటు- హైపర్‌ మార్కెట్‌ల నిర్మాణం చేసేందుకు లూలూ గ్రూప్‌ ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించి భూ కేటాయింపులు చేయాల్సిందిగా ఏపీఐఐసీని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ ఆదేశించారు. 2014లో ఏపీలో టిడీపీ ప్రభుత్వం కొలువు తీరగానే విశాఖపట్నంలో లూలూ గ్రూప్‌ పెట్టుబడులు పెట్టేందుకు.. నాటి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక గత టీడీపీ ప్రభుత్వం చేసుకున్న పలు ఒప్పందాలను జగన్‌ ప్రభుత్వం రద్దు చేసింది. అందులో లూలూ గ్రూప్‌ సైతం ఉంది. అయితే లూలూ గ్రూప్‌ తమిళనాడులో తన పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువు దీరడంతో ఈ ఏడాది జనవరిలో సీఎం చంద్రబాబుతో లూలూ గ్రూప్‌ సంస్థల అధినేత అమరావతిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు లూలూ కంపెనీ తన ఆసక్తిని కనబరిచింది. దీంతో గతంలో కేటాయించిన భూమిని తిరిగి కేటాయిస్తూ.. కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

విశాఖలో లులూ గ్రూప్‌ నిర్మించనున్న షాపింగ్‌ మాల్‌, హైపర్‌ మార్కెట్ల నిర్మాణానికి భూమి కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీఐఐసీ ద్వారా లులూ గ్రూప్‌నకు విశాఖలో భూకేటాయింపులు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ బీచ్‌ రోడ్‌లోని హార్బర్‌ పార్కులో ఉన్న 13.43 ఎకరాలను ఏపీఐఐసీకి బదలాయించాలని వీఎంఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. లులూ గ్రూప్‌ సంస్థ విశాఖ నగరంలో అంతర్జాతీయ స్థాయి మాల్‌ నిర్మాణం పెట్టుబడులకు ఎస్‌ఐపీబీలో ఆమోదించినట్టు పరిశ్రమల శాఖ వెల్లడించింది. 2023లో లులూ గ్రూప్‌నకు చేసిన భూకేటాయింపులను వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది.

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS