Sunday, April 13, 2025
spot_img

పోలీసులపైకి దూసుకొచ్చిరన లారీ

Must Read

ప్రమాదంలో హోంగార్డు మృతి

మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మియాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు సింహాచలం, రాజవర్ధన్‌, విజేందర్‌ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మెట్రో స్టేషన్‌ పిల్లర్‌ నంబర్‌ 600 వద్ద విధులు నిర్వహిస్తున్నారు. నో ఎంట్రీ వాహనాలను నియంత్రిస్తున్నారు. అదే సమయంలో కూకట్‌పల్లి భరత్‌ నగర్‌లో బియ్యం బస్తాలను అన్‌లోడ్‌ చేసిన ఓ లారీ.. మియాపూర్‌ వైపు అతివేగంగా వచ్చి ట్రాఫిక్‌ బూత్‌ను ఢీకొట్టింది. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై పడింది. దీంతో హోంగార్డు మృతి చెందాడు. లారీ దూసుకు రావడంతో ట్రాఫిక్‌ విధుల్లో ఉన్న రాజవర్ధన్‌, వికేందర్‌, సింహాచలం తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సింహాచలం మృతి చెందాడు. మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest News

నిరుద్యోగి జీవితం..

ఈ జీవితంలో రోజులు గడిచేలా ఖాళీ క్యాలెండర్ పేజీలు మాత్రమే మిగులుతాయి. కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం కూడా అలసటతో నీరసపడుతుంది. కానీ… ఈ అంధకారంలోనూ ఒక చిన్న...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS