Sunday, September 7, 2025
spot_img

అత్యుత్సాహం ప్రదర్శించిన మోహన్‎బాబు..మీడియా ప్రతినిధులపై దాడి

Must Read

హైదరాబాద్ శివారులోని జల్‎పల్లిలోని మోహన్‎బాబు నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంగళవారం సాయింత్రం జల్‎పల్లిలోని అయిన నివాసం వద్దకు కవరేజ్‎కు వెళ్ళిన మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు.ఈ క్రమంలో కొంతమంది మీడియా ప్రతినిధులకు గాయాలు అయ్యాయి.

దీంతో జర్నలిస్టులు మోహన్‎బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మోహన్‎బాబు మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అయినపై తక్షణమే హత్యయత్నం కింద కేసు నమోదు చేయాలని, మోహన్‎బాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ మారుతి సాగర్ స్పందించారు. మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని అయిన విజ్ఞప్తి చేశారు.

మరోవైపు మంచు కుటుంబంలో వివాదాల నేపథ్యంలో మోహన్‎బాబు గన్‎ను సీజ్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This