Wednesday, April 16, 2025
spot_img

రైల్వేలో ఉద్యోగాల జాతర

Must Read
  • 9970 జాబ్స్‌ భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
  • మే 11వరకు అన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 9,970 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులు భర్తీ చేసేందుకు రైల్వే శాఖ ఆధ్వర్యంలోని ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టెన్త్‌, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 12 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మే 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ఖాళీలు భర్తీ ఆర్‌ఆర్‌బీ రీజియన్లు ఇవే: అహ్మదాబాద్‌, అజ్‌మేర్‌, బెంగళూరు, భోపాల్‌, భువనేశ్వర్‌, బిలాస్‌పూర్‌, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్‌, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్‌, పట్నా, ప్రయాగ్‌రాజ్‌, రాంచీ, సికింద్రాబాద్‌, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్‌ రీజియన్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఆర్‌ఆర్‌బీ జోనల్‌ వారీగా ఏఎల్‌పీ ఖాళీలు:
సెంట్రల్‌ రైల్వే ఖాళీలు – 376, ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే ఖాళీలు – 700, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ఖాళీలు – 1,461, ఈస్ట్‌ రైల్వే ఖాళీలు – 868, నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వే ఖాళీలు – 100 నార్త్‌ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే ఖాళీలు – 125, నార్తన్‌ రైల్వే ఖాళీలు – 521, సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే ఖాళీలు – 679, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఖాళీలు – 989, సౌత్‌ ఈస్ట్‌సెంట్రల్‌ రైల్వే ఖాళీలు – 568, సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే ఖాళీలు – 921, సధరన్‌ రైల్వే ఖాళీలు – 510, వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే ఖాళీలు – 759, వెస్ట్రన్‌ రైల్వే ఖాళీలు – 885, మెట్రో రైల్వే కోల్‌కతా ఖాళీలు – 225లు వున్నాయి.

అర్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఇంజినీరింగ్‌ డిగ్రీ చేసినవారూ అప్లయ్‌ చేసుకోవచ్చు.
వయోపరిమితి: 01.07.2025 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప్రారంభ వేతనం: నెలకు రూ.19,900 ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ తేది: ఏప్రిల్‌ 12, 2025

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 11, 2025

Latest News

రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం

అనేకకార్యక్రమాలు అమలుచేసి చూపాం సిఎల్‌పి సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను హృదయపూర్వకంగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS