Monday, July 21, 2025
spot_img

బెదిరింపులు, అక్రమాలే పెట్టుబడిగా రియల్ వ్యాపారం.

Must Read
  • ప్రెస్టీజ్ గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ, వైష్ణోయి గ్రూప్స్ వారి దురాగతం
  • ఖాళీ భూమికి హెచ్.ఎం.డి.ఏ నుండి లేఅవుట్ అనుమతులు..
  • అక్రమంగా గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం..
  • మున్సిపల్ నిబంధనలంటే వీరికి లెక్కేలేదు..
  • అమాయకులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న దుర్మార్గం..
  • రెండు ఎకరాల వాటర్ బాడీ మర్రివానికుంట స్వాహా..
  • పార్కులు, రోడ్లు, పబ్లిక్ స్థలాలు కాజేసిన దుర్మార్గం..
  • తెలిసి కూడా హద్దులు నిర్మించని సంబంధిత అధికారులు..
  • హైడ్రా, హెచ్ఎండిఏ, విజిలెన్స్, మున్సిపల్ శాఖ ఉన్నత అధికారులఫై సీ.ఎం. రేవంత్ రెడ్డి దృష్టి సారించి ఈ మోసాన్ని అరికట్టాలి..
  • అమాయకుల జీవితాలను కాపాడాలి అంటున్న సామాజికవేత్తలు..

ప్రిస్టేజ్ రియల్ ఎస్టేట్ సంస్థ, వైష్ణోయి గ్రూప్స్ .. వీరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.. నిజాయితీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు.. వీరికి ఎలాంటి అనుమతులు వుండవు.. ఒకవేళ అనుమతులు తూ తూ మంత్రంగా తీసుకున్నా వీరు నిర్మాణాలు అక్రమాలకూ ఆలవాలాలుగా నిలుస్తున్నాయి.. వాటర్ బాడీ, పార్కులు, రోడ్లు, పబ్లిక్ స్ధలాలు అడ్డగోలుగా కాజేశారు.. వాస్తవాలు తెర్లుసుకుని ఎవరైనా ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరిస్తారు.. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు సామాన్యులు కూడా కాదు.. పేరున్న ప్రముఖులే.. తమకు ప్రాణ భయం ఉందని నెత్తి నోరు కొట్టుకుంటున్న అధికారులెవరూ పట్టిన్చుకున్న పాపానపోలేదు.. ఇలాంటి పరిస్థితుల్లో వీరి వెంచర్లలో ఆస్తులు కొనుగోలు చేసిన అమాయకుల పరిస్థితి ఏమిటి..? ఎదురెళ్లి ప్రశ్నించగలరా..? ఒకవేళ ప్రశ్నించినా బ్రతికి బట్టకట్టగలరా..? ఇలాంటి వారిని ఖచ్చితంగా అరికట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సామాజికవేత్తలు..

భారతదేశంలోనే పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థ ప్రెస్టీజ్ గ్రూప్ సంస్థ.. ఈ సంస్థ ముంబాయి, చెన్నై, బెంగళూరు, కేరళలతో బాటు తెలంగాణలోని హైదరాబాద్ మహానగరంలో 8 ప్రాజెక్టులు చేస్తోంది.. ఇలా పేరు ఉన్న మహా నగరాలలో వందల సంఖ్యలో పెద్దపెద్ద నిర్మాణాలు చేపట్టి సామాన్యులకు, సంపన్నులకు ఇళ్లను నిర్మించి అందించడం వీరి యొక్క వ్యాపారం.. ఈ క్రమంలో ఇంత పెద్ద సంస్థ అవినీతికి పాల్పడింది.. ఈ ప్రిస్టేజ్ తోబాటు వైష్ణోయి సంస్థకూడా జతకట్టింది..

బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ మండల్ రెవెన్యూకు సంబంధించి మామిడిపల్లి గ్రామం సర్వేనెంబర్స్ : 111, 112, 113, 115, 117/1, 117/2, 117/3, 118/3, 119, 122 గల స్థలంలో.. ప్రెస్టేజ్ గ్రూప్, వైష్ణోయి సంస్థలు సoయుక్తంగా 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం చేపట్టింది.. ఇంతవరకూ బాగానే ఉంది.. ఆతరువాతే అసలు భాగోతం బయటపడింది..

అయితే ఇక్కడ జరిగిన అక్రమం ఏమిటంటే “మర్రివానికుంట” విస్తీర్ణం రెండు ఎకరాలను పూర్తిగా చదును చేసి, అక్రమ పద్ధతిలో వెంచర్ చేశారు.. ఈ విషయంపై హైడ్రా ప్రత్యేక దృష్టిసారించాలని స్థానిక జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రెస్టేజ్ గ్రూప్ సంస్థ 40 ఎకరాలలో తీసుకున్న హెచ్ఎండిఏ అనుమతులు వారు కేటాయించిన పబ్లిక్ ఓటిలిటీ స్థలాలు పార్కులు రోడ్లు అన్నీ కూడా వారికి అనుకూలంగా మలుచుకుని వెంచర్ చేసి ప్లాట్లు చేశారని స్థానిక మున్సిపాలిటీ నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ విషయంపై.. మున్సిపల్ శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి సాధించాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి..

ప్రెస్టేజ్ గ్రూప్, వైష్ణోయి సంస్థ సయుక్తంగా 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి నుండి లేఅవుట్ అనుమతులు తీసుకొని, గేటెడ్ కమ్యూనిటీ అనుమతులు తీసుకోకుండా చుట్టూ ప్రహరీ నిర్మించి, పార్కు స్థలాలను రోడ్లను ప్లాట్ లు గా చేసి అవినీతికి పాల్పడి గేటెడ్ కమ్యూనిటీలా ప్రకటనలు గుప్పించి ప్రభుత్వానికి కోట్లల్లో పన్ను ఎగవేయడం జరిగింది.. ఈ విషయంపై స్థానిక మున్సిపాలిటీ బడంగ్పేట్ కమిషనర్ కి ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇచ్చి అటువైపు కూడా కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది.. అవినీతికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక జనం డిమాండ్ చేస్తున్నారు..

ఇక వీరిపై పోరాటం సాగిస్తున్న బీజేపీ అధికార ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి.. కథ వేరేగా వుంది.. ప్రిస్టేజ్ కంపెనీ, వైష్ణోయి గ్రూప్స్ వారు దౌర్జన్యకాండకు దిగుతున్నారు.. ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతోంది.. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అంతం చేస్తారా..? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి..? ఏదైర్యంతో బెదిరింపులకు పాల్పడుతున్నారు..? ఇలాంటి దుర్మార్గులను ఎవరు వెనుక నుండి నడిపిస్తున్నారు..? అమాయకుల జీవితాలతో ఆడుకునే హక్కు వీరికి ఎవరు కల్పించారు.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది.. నీటి కుంటలను, పార్కులు, రోడ్లు పబ్లిక్ స్ధలాలు కాజేసిన ఇలాంటి సంస్థలను నిలువరించకపోవడం దురదృష్టకరం.. హైడ్రా లాంటి ప్రభుత్వ రంగ సంస్థ దూకుడుకా వ్యవహరిస్తున్న తరుణంలో ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్న వారు భయపడకుండా ఇంకా ఇంకా రెచ్చిపోతుండటం దేనికి సంకేతం..?

కాగా జరిగిన ఈ అవినీతి విషయంపై స్థానిక మున్సిపాలిటీ బడంగ్పేట్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇచ్చి అటువైపు కూడా కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది.. ఈ విషయంపై మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తే పెద్దవారు ఉన్నారు మా ఉద్యోగాలు ఉడుతాయని జవాబు ఇవ్వడం కొసమెరుపు.. ఈ అవినీతి అక్రమాలలో ఎవరి వాటా ఎంత అనే విషయం ఉన్నతాధికారులకు అందిన వాటాలు ఎంత అన్నది లోతైన పరిశోధన చేసి.. అవినీతికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక జనం డిమాండ్ చేస్తున్నారు.. ఇదిలా ఉంటే సర్వేనెంబర్ 141 లో ప్రభుత్వానికి సంబంధించిన దాదాపు రెండు ఎకరాలు ల్యాండ్ కబ్జా చేసి ప్లాటింగ్ చేయడం జరిగింది.. అంతేకాకుండా నల్లవాగు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి కొత్తచెరువు, మర్రివాని కుంటా నుండి జల్పల్ చెరువులకు పోయే వాటర్ వాగు ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయాయి.. సర్వే నెంబర్ 32 హనుమాన్ దేవాలయం భూమి కబ్జా చేసి వెంచర్ కు రోడ్డు వేయడం జరిగింది.. 32 నెంబర్ సర్వేనెంబర్ 1-20 భూమి రికార్డులో గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తుంది.. 2013లో రిజిస్ట్రేషన్ ఒక వ్యక్తి మీద చేయడం జరిగింది. ఇది దేవాలయం భూమి.. సర్వేనెంబర్ 10 మామిడిపల్లిలో వైష్ణోయి గ్రూప్ కబ్జా చేయడం జరిగింది.. దాదాపు 200 కోట్ల ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలు చేశారు.. ఈ విషయం పై కంప్లైట్ ఇస్తే బెదిరింపులకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే విషయం.. రెవెన్యూ ఆఫీసర్ ఎమ్మార్వో కి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె ఎటువంటి ఆక్షన్ తీసుకోవడం లేదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అధికారులు కొమ్ముకాస్తున్నారని అనిపిస్తుంది.. ఎమ్మార్వో తక్షణమే స్పందించి ప్రభుత్వ భూములు కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.. తక్షణమే ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు, హైడ్రా లాంటి ప్రెస్టీజియస్ సంస్థ తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.. హైడ్రా రంగనాథ్ గారు తగిన న్యాయం చేసి అమాయకులను కాపాడతారనే నమ్మకాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు..

Latest News

మెదడు ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే జీవితానికే ముప్పు!

వేగంగా మారుతున్న జీవనశైలిలో… మెదడు ఆరోగ్యాన్ని మరవొద్దు! తొలినాళ్ల లక్షణాలే హెచ్చరికలు.. వెంటనే స్పందించాలి : కేర్ వైద్యులు మన శరీరాన్ని నియంత్రించే అత్యంత ముఖ్యమైన అవయవం మెదడు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS