Friday, October 3, 2025
spot_img

ఎర్రకోట స్వాతంత్య్ర‌ వేడుకలకు రాహుల్, ఖర్గే గైర్హాజరు

Must Read

దేశ రాజధానిలోని ఎర్రకోటపై నేడు జరిగిన 79వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతేడాది జరిగిన వేడుకల్లో రాహుల్ గాంధీకి కేటాయించిన సీటుపై నెలకొన్న వివాదమే ఈసారి వారు వేడుకలకు దూరంగా ఉండటానికి కారణమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఇద్దరు నేతలు వేరువేరు ప్రాంగణాల్లో జాతీయ జెండా ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్య్ర‌ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ ప్రధాన కార్యాలయంలో, రాహుల్ గాంధీ ఇందిరా భవన్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. “గొప్ప స్వాతంత్య్ర‌ సమరయోధుల త్యాగాలతో సాధించిన స్వేచ్ఛను కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత” అని రాహుల్ పేర్కొన్నారు.

అయితే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గైర్హాజరుపై బీజేపీ మండిపడింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ, “స్వాతంత్య్ర‌ దినోత్సవం జాతీయ వేడుక. మోదీపై వ్యతిరేకతతో రాహుల్ దేశానికి వ్యతిరేక వైఖరి ప్రదర్శించారు. ఇది రాజ్యాంగాన్నీ, సైన్యాన్నీ అవమానించడమే” అని ఎక్స్ వేదికగా విమర్శించారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రతిపక్ష అగ్రనేతల గైర్హాజరు ప్రస్తుత కేంద్ర-కాంగ్రెస్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతలకు సంకేతంగా భావించవచ్చని చెబుతున్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This