Saturday, October 4, 2025
spot_img

27న సికింద్రాబాద్ జగన్నాథ రథయాత్ర

Must Read
  • మరుసటి రోజు ఉదయం తిరిగి ఆలయానికి చేరుకోనున్న రథయాత్ర

శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ప్రతి ఏడాది జగన్నాథ పూరిలోని రథయాత్రతో సమానంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవతల కోసం రథయాత్రను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ గత 130 సంవత్సరాలుగా సికింద్రాబాద్‌ జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయం నుండి ఈ రథయాత్రను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.

ఈ వైభోత్సవ కార్యక్రమం సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ ట్రస్టీ.. శ్రీ పురుషోత్తం మలాని మాట్లాడుతూ.., “జగన్నాథుడి వార్షిక రథోత్సవాన్ని , సంబంధిత వేడుకలను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. సికింద్రాబాద్ – హైదరాబాద్ నుండి భక్తులు పెద్ద సంఖ్యలో భగవంతుని ఆశీస్సులు పొందుతారని మేము ఆశిస్తున్నాము” అని అన్నారు. ఈ రథయాత్ర నేపథ్యంలో పేర్కొన్న సమయాలను గమనించి, తదనుగుణంగా దర్శనం ప్లాన్ చేసుకోవాలని ఆయన అందరినీ అభ్యర్థించారు.

Secunderabad Jagannath Rath Yatra
Secunderabad Jagannath Rath Yatra

ఈ నేపథ్యంలో దర్శనం కోసం ఆలయ ద్వారాలు ఉదయం 6:15 గంటలకు తెరిచి మధ్యాహ్నం 1:00 గంటలకు మూసివేయబడతాయి. ఆ తర్వాత, రథయాత్ర ఊరేగింపు సాయంత్రం 4:00 గంటలకు ఆలయం నుండి ప్రారంభమై జనరల్ బజార్ నుండి కొనసాగి., సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:00 వరకు ఎం జి రోడ్ కి చేరుకుంటుంది. ఆ తర్వాత రాణిగంజ్‌లోని హిల్ స్ట్రీట్ నుండి వెళ్లి మరుసటి రోజు ఉదయం 4:00 గంటలకు ఆలయానికి తిరిగి చేరుకుంటుంది

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This