Friday, October 17, 2025
spot_img

యూ.జి.సి పే స్కేల్స్ అమలుపర్చే విధంగా చర్యలు తీసుకుంటాం

Must Read
  • ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి

యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూ.జి.సి పే స్కేల్స్ అమలు చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిను కోరారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల పరిస్థితి, వేతనాల చెల్లింపు, అకాడమిక్ పరిస్థితి తదితర అంశాలపై ఆకునూరి మురళి అధ్యాపకులతో సుదీర్ఘంగా చర్చించారు.ఈ సంధర్బంగా విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న అనేక సమస్యలను వారు చర్చించారు. ప్రభుత్వం దృష్టికి కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను తీసుకెళ్లి యూజీసీ పే స్కేల్స్ అమలుపర్చే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. దీంతో కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం ఆకునూరి మురళికు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ధర్మ తేజ, డాక్టర్ ఉపేందర్, డాక్టర్ విజేందర్ రెడ్డి, డాక్టర్ సిహెచ్ వెంకటేష్, డాక్టర్ మాధవి, డాక్టర్ సునీత, డాక్టర్ సురేష్ నాయక్, డాక్టర్ శివ రెడ్డి, డాక్టర్ అశోక్, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This