Wednesday, April 2, 2025
spot_img

ఆందోళనలు విరమించి, పరీక్షలకు సిద్ధం కావాలి

Must Read

గ్రూప్స్ అభ్యర్థులు ఆందోళనలు విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం రాజేంద్రనగర్ పోలీస్ ఆకాడమీలో పోలీస్ డ్యూటి మీట్ ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సంధర్బంగా వారు మాటాడుతూ, గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని, గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షను ఎట్టి పరిస్థితిలో నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. పరీక్షల కోసం నిరుద్యోగులు ఎన్నో ఏళ్లుగా నిరీక్షీస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేలాది కొత్త ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఒక్కసారి గ్రూప్ 01 నియామకాలు జరగలేదని గుర్తుచేశారు. ఇప్పటికైనా అభ్యర్థులు కాలయాపన చేయకుండా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. గ్రూప్ 01 అభ్యర్థులను కొంతమంది కావాలనే రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కొన్ని పార్టీల మాయమాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని అన్నారు.

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS