Wednesday, March 19, 2025
spot_img

క్షేమంగా భూమ్మీదకు సునీతా విలియమ్స్‌

Must Read
  • ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగిన డ్రాగన్‌ క్రూ కాప్సూల్‌
  • వైద్య పరీక్షల కోసం తరలింపు

ఇన్నాళ్లుగా యావత్‌ ప్రపంచం ఎదుర్కొన్న ఉత్కంఠకు శుభం కార్డు పడిరది. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ సురక్షితంగా భూమి విూద దిగారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.27 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న డ్రాగన్‌ క్రూ కాప్సూల్‌ ఫ్లోరిడా తీరానికి సవిూపంలోని సముద్రజలాల్లో పారాషూట్‌ల సాయంతో సురక్షితంగా దిగింది. సునీతా, బుచ్‌లతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా వచ్చారు. తొలుత సునీతా, బుచ్‌ను నాసా సిబ్బంది జాగ్రత్తగా క్యాప్సూల్‌ నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని వైద్య పరీక్షల కోసం స్ట్రేచ్చ‌ర్ల‌పై తరలించారు. ఐఎస్‌ఎస్‌లోని సూక్ష్మస్తాయి గురుత్వాకర్షణ శక్తిలో ఎక్కువ సమయం గడిపినందుకు ఇద్దరు వ్యోమగాములు బలహీనంగా మారారని నిపుణులు చెబుతున్నారు. కండరాలు క్షీణించడం, సరిగా నిలబడలేక బ్యాలెన్స్‌ కోల్పోవడం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. సునీతా విలియమ్స్‌ ల్యాండిరగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక సునీతా విలియమ్స్‌ ల్యాండిరగ్‌కు సంబంధించి 2013లో వచ్చిన హాలీవుడ్‌ మూవీ గ్రావిటీ- సినిమాకు గుర్తుకుతెచ్చింది. 2013లో హాలీవుడ్‌ నుంచి వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం గ్రావిటీ. ఈ సినిమాలో హాలీవుడ్‌ హీరోయిన్‌ సాండ్రా బుల్లక్‌ కథానాయికగా నటించగా.. అల్ఫోన్సో కారోన్‌ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌లో సాండ్రా బుల్లక్‌ అంతరిక్షం నుంచి భుమికి ల్యాండ్‌ అయిన సన్నివేశం ప్రస్తుతం సునీత విలియమ్స్‌ ల్యాండిరగ్‌ను గుర్తుకుతెస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం వారిని హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు తరలిస్తారు. అక్కడ కొన్ని రోజుల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా గమనిస్తారు. వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిని నానా వైద్యులు క్షుణ్ణంగా పరిశీలించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాకే కుటుంబ సభ్యులు వారిని కలుసుకునేందుకు అనుమతిస్తారు. ఇక అంతరిక్షంలో వ్యోమగాముల అనుభవాలను కూడా నాసా రికార్డు చేయనుంది. సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉన్న సమయంలో ఎదురైన సవాళ్లు, అనుభవాలు వంటివన్నీ తెలుసుకుని నాసా అధికారులు రికార్డు చేసుకుంటారు. చివరిగా వ్యోమగాములను తమ కుటుంబసభ్యులను కలుసుకునేందుకు అనుమతి ఇస్తారు. భూవ్మిూదకు వచ్చాక తాను ముందుగా కుటుంబసభ్యులతో పాటు పెంపుడు శునకాలను కూడా చూడాలనుకుంటున్నట్టు సునీతా విలియమ్స్‌ ఇటీవల పేర్కొన్నారు. గతేడాది బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్ర కోసం వెళ్లిన ఇద్దరు వ్యోమగాముల సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే తొమ్మిది నెలల పాటు- చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

Latest News

అమరావతికి అంతర్జాతీయ సంస్థల రుణాలు

రైల్వే ప్రాజెక్ట్‌ ఖర్చు కేంద్రమే భరిస్తుంది శాసనమండలిలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS