Wednesday, September 10, 2025
spot_img

ఇవాళ తెలంగాణ మంత్రివర్గ సమావేశం

Must Read

తెలంగాణ క్యాబినెట్ ఇవాళ (జూన్ 5న గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. రాజీవ్ యువవికాసం, ఉద్యోగుల సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, భూభారతి, రెవెన్యూ సదస్సులు, రైతు భరోసా, వర్షాకాలం సన్నద్ధత తదితర అంశాలపైనా ఫోకస్ పెట్టనున్నారు. అలాగే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై కూడా క్యాబినెట్ భేటీలో చర్చించనున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కమిటీ నివేదిక కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే వీలుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా భూభారతిని ప్రారంభించిన ప్రభుత్వం అందులో ఎదురవుతున్న సమస్యలను, భూభారతి అమలుతీరును చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాయిదా పడిన రాజీవ్ యువవికాసం పథకంపై చర్చించి మళ్లీ ఎప్పుడు ప్రారంభించేదీ నిర్ణయించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, ధాన్యం కొనుగోళ్లు, వానా కాలం పంటల సాగు సన్నద్ధత వంటి అంశాలపై చర్చిస్తారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This