Thursday, April 24, 2025
spot_img

పేదోడికి సన్నబియ్యం బువ్వ ఆందించాలన్న ఆలోచన

Must Read
  • ప్రతి ఒక్కరూ ఇందుకు అర్హులు కావాలన్న లక్ష్యం
  • లబ్దిదారుడి ఇంట భోజనం చేసిన మంత్రి పొన్నం

పేదోళ్లు కూడా సన్నం బువ్వ తినాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడలో సన్న బియ్యం లబ్ధిదారు తలారి చంద్రయ్య ఇంట్లో మంత్రి పొన్నం, లెక్టర్‌ మనుచౌదరి, ఇతర అధికారులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సన్న బియ్యం కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయమని, దేశంలో మన రాష్ట్రంలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాల్లో రేషన్‌ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేసేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే తాను సంతోషిస్తామని అన్నారు. అయితే సన్న బియ్యం పంపిణీ ని రాద్దాంతం చేసే ప్రయత్నం చేయొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలనీ చాలా కార్యక్రమాలు కొనసాగిస్తుంది. ఎవరు హక్కుదారులు ఎవరు వాటదారులు అనే సందర్భం ఇది కాదు. సన్న బియ్యం తింటున్న ప్రజలకు ఇంకా ఏవిధంగా మేలు చేయాలనే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఒకవైపు సన్న బియ్యం మరోవైపు ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్‌ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించడానికి మెస్‌ చార్జీలు, కాస్మోటిక్‌ ఛార్జీలు పెంచాం, ఉద్యోగ నియామకాలు చేశాం, సన్న వడ్లకి 500 బోనస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఈ మేరకు సన్న బియ్యం పథకం ఎలా ఉంది..? అని మంత్రి మల్లవ్వను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాము రేకుల గుడిసెలో నివాసం ఉంటున్నట్లు చెప్పింది. మంత్రిని తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.

ఈ మేరకు మల్లవ్వ మంచి భోజనం పెట్టిందన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ వారి కుంటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంను ఉగాది పండుగ సందర్భంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లా, కోహెడ మండల కేంద్రంలో సన్న బియ్యం పథకం లబ్ధిదారులతో భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ పథకానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సన్న బియ్యం పథకం ప్రజల మంచి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన చారిత్రాత్మక పథకంగా మారిందని, ఈ పథకం కింద, ప్రతీ పౌరుడికి కనీసం ఒకసారి సన్న బియ్యం తినేందుకు అవకాశం ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణలో మాత్రమే జరుగుతున్నందున, అది దేశంలో ఇతర రాష్ట్రాల్లో ప్రేరణగా మారాలని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పౌరుడికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించిందని, ఉగాది పండుగ నుండి ఈ కార్యక్రమం ప్రారంభించా మన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పథకమని మంత్రి పొన్నం అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింతగా ప్రజలకి చేరుకోవాలని, సన్న బియ్యం పథకంలోకి ప్రతీ పౌరుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. జమ్మూ కాశ్మీర్‌ ఘటనపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరం. ఇది రాజకీయాలకతీతంగా మనం ఖండించాలని అన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా, కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని మంత్రి కోరారు.

Latest News

పార్టీ పదవుల్లో సీనియర్లకే పెద్దపీట

పిసిసి అబర్వర్ల సమావేశంలో మీనాక్షి వెల్లడి సమావేశానికి రానివారి పేర్లు తొలగింపు కాంగ్రెస్‌ పార్టీ పదవుల్లో సీనియర్లకు పెద్ద పీట వేయనున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS