Thursday, March 13, 2025
spot_img

వర్సిటీల్లో తప్పు చేయాలంటే భయం పుట్టాలి

Must Read
  • ఆంధ్రావర్సిటీ అక్రమాలపై విచారణకు ఆదేశించాం
  • అసెంబ్లీలో గత విసి అక్రమాలపై సభ్యలు ప్రశ్నలు
  • పూర్తిస్థాయి విచారణ చేపట్టామని లోకేశ్ హామీ

వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. వైకాపా ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని తెదేపా, భాజపా, జనసేన ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై తెదేపా ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్‌, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడారు. అనంతరం మంత్రి లోకేశ్‌ వారికి సమాధానమిచ్చారు. ఏయూలో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఇన్‌ఛార్జ్‌ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించారన్నారు. ఆ విచారణ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు అవుతున్నా ఇంకా ఉపేక్షించడం తగదన్నారు. నిర్దిష్ట కాలపరిమితితో విచారణను వేగవంతం చేయాలని ఆయన కోరారు. మరో ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ.. గతంలో వీసీగా పనిచేసిన ప్రసాదరెడ్డి వైకాపా అధ్యక్షుడి తరహాలో వ్యవహరించారని ఆరోపించారు. ఎంతో పేరున్న ఏయూను రాజకీయ వేదికలా ఆయన మార్చారని ఆక్షేపించారు. ఇతర వర్సిటీల ప్రక్షాళన కూడా జరగాలని జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు. ఆంధ్రా యూనివర్సిటీ అంటే అందరికీ ఒక సెంటిమెంటుతో కూడుకున్నదని, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా ఛైర్మన్‌, జిఎమ్మార్‌ అధినేత ఏయూలో చదువుకుని వచ్చిన వారేనని, ఏయూ ప్రపంచంలోనే టాప్‌ 100లో ఉండాలని సిఎం చంద్రబాబు భావించారని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌ అన్నారు.

గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో ఆయన మాట్లాడుతూ.. ఏయూ టాప్‌లో ఉండాలనే ఉద్దేశంతో ఐఐటి కరఖ్‌ పూర్‌ ప్రోఫెసర్‌ రాజశేఖర్‌ను ఏయూ వీసీగా నియమించామన్నారు. మాజీ సిఎం జగన్‌ విశాఖపట్నం వస్తే పిల్లలను రోడ్డుపైకి తెచ్చి స్వాగతం పలికించుకునేవారని, రూసా గ్రాంట్స్‌, ఇస్రో గ్రాంట్‌ను దుర్వినియోగం చేశారని మంత్రి లోకేష్‌ విమర్శించారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డి రూలింగ్‌ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని అన్నారు. దీనిపై ఇన్చార్జి వీసీ ఒక కమిటీని నియమించారని తెలిపారు. విజిలెన్స్‌ అకౌంట్‌ కూడా వేశామన్నారు. సభ డిమాండ్‌ మేరకు కమిటీ విచారణ జరిపి 60 రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని మంత్రి లోకేష్‌ కమిటీని ఆదేశించారు. ఇంకోసారి పొరపాటు చేయాలంటే బయపడేటట్టు చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రమాణాలను పెంచి గతవైభవం తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఏయూ మాజీ వీసీ ప్రసాద్‌ రెడ్డిపై ఉన్న ఆరోపణల విషయంలో ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఫండ్స్‌ డైవర్సన్‌, అక్రమ నియామకాలతో ఏయూను రాజకీయ కార్యాలయంగా ఎలా మార్చారో అందరికి తెలసునని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ 1926లో స్ధాపించబడిరదని, తాను కూడా యూనివర్సిటీ పూర్వవిద్యార్ధినని చెప్పారు. సెనేట్‌ హలులో రాజకీయ నాయకుల పుట్టిన రోజు పార్టీలు చేశారని, అడ్మినిస్టేష్రన్‌ మ్యాన్యువల్లో ఉన్నట్లు ఆయన ఫాలో అవ్వలేదని, ఇష్టానుసారం అపాయింట్మెంట్‌ ఇచ్చారని శ్రీనివాసరావు అన్నారు. అతనిని ప్రైవేటు కాలేజీల నుండి తెచ్చి అసిస్టెంట్‌ ప్రోఫెసర్లుగా జగన్‌ నియమించారని, కొలిగ్స్‌ ఎవ్వరయినా లేట్‌గా వస్తే వారికి రూ. 25వేలు ఫైన్‌ వేసేవారని అన్నారు. గతంలో గ్రాడ్యూఏట్‌ ఎమ్మెల్సి ఎన్నికలు అవుతుంటే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో దసపల్లా హోటల్‌లో విూటింగ్‌ పెట్టారని అన్నారు. దీనిపై కూడా విచారణ చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చక కూడా ఇలాంటి క్రిమినల్స్‌ విషయంలో ఉదాసీనంగా ఉండడం తగదని అన్నారు.

ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీని ప్రసాద్‌ రెడ్డి వైసీపీ కార్యాలయంగా మార్చాడని, గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు, మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో డబ్బు సంచులు మొదలుకోని అన్ని ఏయూలోనే జరిగాయన్నారు. యూజిసి రూసా నిధులు డిపిఆర్‌ ప్రకారం కాకుండా కోట్లది రూపాయయలు ఇష్టాను సారం నిధులు డైవర్ట్‌ చేశారని ఆరోపించారు. ఉద్యోగాల నుండి తొలగింపబడ్డ వ్యక్తిని బ్యూటిఫికేషన్‌ డీన్‌గా పెట్టి 80 లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారని, యూనివర్సిటీలోని భారీ వృక్షాలను జగన్‌ హెలీప్యాడ్‌ల కోసం కొట్టేశారని వీటన్నింటిపై విచారణ జరపాలని ఆయన అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసి విద్యార్ధులను ఇబ్బందులు పెట్టారని,పేద విద్యార్ధులకు యూనివర్సిటీని దూరం చేశారని, ఇంకా ప్రసాద్‌ రెడ్డి గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదని.. ఆయనపై విచారణకు టైంబౌండ్‌ పెట్టి చర్యలు తీసుకోవాలి రామకృష్ణ బాబు డిమాండ్‌ చేశారు. ఆంధ్రాయూనివిర్సిటీ అనగానే సర్వేపల్లి రాధాకృష్ణన్‌, సివిరామన్‌, సరోజిని నాయుడు, నీలం సంజీవరెడ్డిలు గుర్తుకు వస్తారని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. నియామకం జరిగాక స్వామి భక్తితో విగ్రహం పెట్టారని, కార్పోరేషన్‌ ఎన్నికల్లో అభ్యర్ధులకు బీఫాంలు ఏయూలో ఇచ్చారని, ఇలాంటివి మళ్లీ ఏ యూనివర్సిటీలో రాజకీయ కార్యకలాపాలు లేకుండా ఉండేలా కఠిన చర్యలు ఉండాలని అన్నారు. అన్ని ఆరోపణలపై విజిలెన్స్‌ విచారణ చేసి కాలపరిమితితో చర్యలు తీసుకోవాలన్నారు.

Latest News

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS