అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 12 దేశాల ప్రయాణికులపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఆ దేశాలు.. అఫ్ఘానిస్థాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్. అగ్రరాజ్యం తాజా నిర్ణయంతో ఈ దేశాల వారు యూఎస్కి రాకపోకలు సాగించటానికి వీల్లేదు. సంబంధిత ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు.
మరో 7 దేశాలపైనా పాక్షిక నిషేధం పెట్టారు. ఈ దేశాలు.. బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్థాన్, వెనెజులా. ఈ నిషేధం ఈ నెల 9 నుంచే అమల్లోకి వస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌజ్ తెలిపింది. ప్రమాదకరమైన విదేశీ వ్యక్తుల నుంచి అమెరికన్లను రక్షిస్తానన్న మాటను అధ్యక్షుడు ట్రంప్ నిలబెట్టుకుంటున్నారని పేర్కొంది. జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.