Friday, June 6, 2025
spot_img

పెద్దల సభకు కమల్ హాసన్

Must Read

ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ పార్లమెంట్‌లోని పెద్దల సభకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, ఎంఎన్ఎం ప్రకటించాయి. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదిరిన ఒడంబడిక ప్రకారం ఎంఎన్ఎం పార్టీకి తాజాగా రాజ్యసభ స్థానం కేటాయించారు.

తమిళనాడు, అస్సాంలలోని 8 ఎంపీ సీట్లకు వచ్చే నెల 19న ఎలక్షన్ జరగనుంది. ఇందులో 6 స్థానాలు తమిళనాడులో, 2 స్థానాలు అస్సాంలో ఉన్నాయి. తమిళనాడు శాసనసభలో డీఎంకే పార్టీకి 134 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాబట్టి ఈ పార్టీ 4 రాజ్యసభ సీట్లలో విజయం సాధించటం ఖాయం. ఈ నాలుగు స్థానాల్లో ఒక చోట కమల్ హాసన్‌ను గెలిపించుకోనుంది. ఆయన 2018లో ప్రారంభించిన ఎంఎన్ఎం పార్టీ కేంద్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామి. డీఎంకే కూడా ఆ అలయెన్స్‌లో కొనసాగుతోంది.

ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ 2024 సాధారణ ఎన్నికల్లో తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాల్లో, పుదుచ్చెరిలోని ఒక చోట డీఎంకే కూటమి తరఫున ప్రచారం చేసింది. అందుకు ప్రతిఫలంగా ఒక రాజ్యసభ సీటును పొందుతోంది. ఈ మేరకు ఇరు పక్షాల మధ్య ముందే ఒప్పందం కుదిరింది.

Latest News

ఇవాళ రిలీజ్ అవుతున్న “శ్రీ శ్రీ శ్రీ రాజావారు”

నార్నే నితిన్ ,చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో.తనకంటూ ఓ పందాన్ని ఏర్పరచుకుని ప్రేక్షకుల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS