Friday, June 6, 2025
spot_img

రాహుల్ గాంధీతో మ‌హేశ్ కుమార్ గౌడ్ భేటీ

Must Read

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (టీపీసీసీ) అధ్య‌క్షుడు మహేష్ కుమార్ గౌడ్.. ఆలిండియా కాంగ్రెస్ క‌మిటీ (ఏఐసీసీ) అగ్రనేత, లోక్‌స‌భ‌లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఢిల్లీలో కుటుంబ సమేతంగా క‌లిశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ రాహుల్ గాంధీతో రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే అందుబాటులో లేక‌పోవ‌టంతో టీపీసీసీ కార్య‌వ‌ర్గ నిర్ణ‌యం వాయిదా ప‌డింద‌ని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నెల 30న మ‌రోసారి సీఎం రేవంత్‌తో క‌లిసి ఢిల్లీ వెళ్ల‌నున్నారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని రాహుల్ గాంధీ చెప్పిన‌ట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్ల‌డించారు.

Latest News

బడి పిల్లల భవిష్యత్‌ను బలిపెట్టకండి

జూన్ నెల వచ్చేసింది. జోలె పట్టుకొని కొత్త బిచ్చగాళ్లు ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది పచ్చి నిజం. మా కాలేజీలో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS