Thursday, June 5, 2025
spot_img

చార్మినార్ జోన్‌లో ముడుపుల మాటున అక్రమ నిర్మాణ అనుమతులు

Must Read

దిల్‌సుఖ్‌నగర్ ట్రాఫిక్ రద్దీ, రోడ్డును మింగేసే భారీ అక్రమ నిర్మాణం..

  • ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా, రెసిడెన్షియల్ నిర్మాణ అనుమతులతో భారీ కమర్షియల్ నిర్మాణం..
  • మాస్టర్ ప్లాన్ పట్టణ ప్రణాళికకు విగాథం కలిగిస్తున్న జిహెచ్ఎంసి చార్మినార్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు..
  • చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారి నర్సింగ్ రావు భారీ ముడుపులు తీసుకుని
    వ్రాతపూర్వక ఫిర్యాదులను తొక్కి పెడుతున్న వైనం…!
  • టీఎస్ బి పాస్…. బిల్డ్ నౌ వెబ్ సైట్ లో పారదర్శకత లోపం.. బరితెగిస్తున్న అవినీతి అధికారులు..
  • జోనల్ కమిషనర్ వెంకన్న, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ కరణ్, హైడ్రా బాస్ రంగనాథ్ దృష్టి సారించాలి…

అడ్డగోలుగా లంచాలు మింగుతూ.. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ.. అనుకోని ప్రమాదాలకు కారణం అవుతూ.. అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్న అవినీతి అధికారుల భాగోతాలు పుంఖాను పుంఖాలుగా ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని వస్తున్నా.. అలాంటి అధికారులపై చర్యలు మాత్రం నామ మాత్రంగా కూడా ఉండటం లేదు.. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే పాలించే ప్రభుత్వాలు, ఉన్నతాధికారులు ముందుకు రావాలి.. భవిష్యత్ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.. ఇక వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా వడ్డిస్తాడు అనే చందంగా అధికారికి ముడుపులు అందితే చాలు అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులను తొక్కి పెడుతున్న చార్మినార్ జోన్ టి.పి.ఎస్. నర్సింగ్ రావు అవినీతిపై ‘ ఆదాబ్ ‘ అందిస్తున్న ప్రత్యేక కథనం..

చార్మినార్ గుల్జార్ హౌస్‌ ప్రాంతంలో ఇరుకైన హాస్పిటల్ భవంతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో 17 మంది మృతి చెందారు. మరి కొందరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. నగర ప్రజలు, దేశ ప్రజలు అందరు కూడా దిగ్బ్రాంతికి గురై శోకసాగరంలో మునిగిపోయారు.. ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరు వహించాలి..? ప్రాణ నష్టానికి బాధ్యత ఎవరు వహించాలి..? ఆ పాపం ఎవరిది..? ఆ మూల్యం ఎవరు చెల్లించాలి..? అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు ఏవి..? అడిగే వారు లేరా..! అసలు ఏం జరుగుతోంది..?ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం కనుమరుగవుతోందా..? ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది..? ఎవరు చెబుతారు..?

ఇదిలా ఉంటే అసలు విషయానికి వద్దాం..
అక్రమ నిర్మాణం వివరాలు :

దిల్సుఖ్ నగర్, గడ్డిన్నారం గ్రామం, సర్వే నంబర్ 9, ప్లాట్ నెంబర్ 29,యూనిట్ నెం: 31..

1) ఫైల్ నెంబర్ : 011514/జీ.హెచ్.ఎం.సి. / 5672 / సిహెచ్ఆర్ /2023 – బీపీ..
2) పర్మిట్ నెంబర్ : 5615 / జిహెచ్ఎంసి / సిహెచ్ఆర్ / 2024 – బీపీ..

దిల్సుఖ్ నగర్ విజయవాడ హైవే ప్రధాన రహదారి ఆనుకుని భారీ కమర్షియల్ నిర్మాణం చేపడుతున్నారు.. ఈ నిర్మాణాన్ని నిశితంగా పరిశీలిస్తే.. ప్రమాదకరంగా నిర్మిస్తున్నారు అని స్పష్టంగా తెలిసిపోతుంది.. ఈ నిర్మాణం ఫైర్ సేఫ్టీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా, ఎలాంటి సెట్ బ్యాక్, చుట్టుపక్కల ఖాళీ స్థలం వదలకుండా రోడ్డు వైపు 20 ఫీట్ల పార్కింగ్ స్థలం కూడా వదలకుండా రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారు.. భవిష్యత్తులో ఏమైనా అగ్ని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు..? అసలే దిల్సుఖ్ నగర్ అత్యంత రద్దీ ప్రాంతం.. ఒకవేళ ఈ నిర్మాణం ప్రారంభించబడితే, పూర్తిగా రోడ్డు మూసుకుపోయి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్మాణానికి ఎదురుగా ఎల్బీనగర్ వెళ్లే ప్రధాన బస్టాండ్ ఉండడం గమనార్హం…!

పట్టణ ప్రణాళిక అధికారి నర్సింగరావు పాత్ర…!

ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించి పదుల సంఖ్యలో స్థానికులు, సామాజిక కార్యకర్తలు వ్రాతపూర్వక ఫిర్యాదులు కింది స్థాయి నుండి, జోనల్ కమిషనర్ స్థాయి వరకు ఇచ్చి ఉన్నారు. ఈ అక్రమ నిర్మాణాన్ని నివారించే బాధ్యత ఫీల్డ్ లెవల్ ఆఫీసర్ టిపిఎస్ నర్సింగ్ రావుకు ఉన్నతాధికారులు అప్పగించారని మాకు ఉన్న సమాచారం.. ఇదే అదునుగా టీవీఎస్ నర్సింగరావు సదరు అక్రమ నిర్మాణదారులతో లక్షల్లో ముడుపులు తీసుకొని వ్రాతపూర్వక ఫిర్యాదులను తొక్కిపెట్టి వ్యవహరిస్తున్నాడు అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ విషయంపై టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారి ఎసిపి గజానంద్ గారిని ప్రశ్నిస్తే టిపిఎస్ నర్సింగరావు నోటీసులు సర్వ్ చేశాడు.. యాక్షన్ తీసుకుంటామని తెలియజేయడం గమనార్హం.. కానీ టిపిఎస్ నర్సింగ్ రావు ఎలాంటి నోటీసులు సర్వ్ చేయకుండా పూర్తిగా ఆక్రమణదారునికి సపోర్ట్ చేస్తూ ఉన్నత అధికారుల కళ్ళల్లో మట్టికొట్టి, మభ్యపెట్టి తెరచాటున అవినీతికి పాల్పడుతున్నాడు అనడానికి ఈ అక్రమ కట్టడంపై ఉన్నతస్థాయి అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తే బహిర్గతం అవుతుంది..

వాస్తవానికి దిల్సుఖ్ నగర్ ప్రాంతం హాస్టల్లతో, ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ తో నిండి ఎడ్యుకేషన్ హబ్ గా.. చిన్నపాటి ప్రభుత్వ నోటిఫికేషన్ వస్తే.. లక్షల్లో యువత ఇక్కడ చిన్న చిన్న గదుల్లో ఉండి చదువుకోవడం.. జీవనాన్ని సాగిస్తుండటం అందరికీ తెలిసిన విషయమే.. కానీ ఇక్కడ గజం జాగా రెండు నుంచి ఐదు లక్షలు విలువ సంతరించుకుంది.. ఇదే అదునుగా ఇక్కడ వెలిసే నిర్మాణాలు పూర్తిగా ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడడం చింతించవలసిన విషయం.. ఇకపోతే దిల్సుఖ్ నగర్ సగం ప్రాంతం జిహెచ్ఎంసి చార్మినార్ జోన్ లోకి రావడం గమనార్హం.. చార్మినార్ జోన్ అంటే అయ్య బాబోయ్ అనే పరిస్థితి.. ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు, మున్సిపల్ నిబంధనలు ఏమీ వర్తించవు.. లాడి ఎందుకో ఉన్నత అధికారులకే తెలియాలి.. రాత్రి వేళల్లో అక్రమ నిర్మాణాలు.. వాటికి టాక్స్ లు ఉండవు.. అసలు టాక్సులు కట్టేవారు ఉండరు.. అధికారులు మాత్రం ప్రభుత్వానికి వచ్చే పన్నును తమ జేబుల్లో నింపుకుంటూ కోట్లకు పడగలెత్తి.. ఏళ్ల తరబడి ఒకటే సీటును అతుక్కుని ఎంజాయ్ చేయడం పరిపాటిగా మారిపోయింది..

అసలు నిబంధనలు ఎందుకు ఉన్నాయి? ఈ అతిక్రమణలు ఎలా జరుగుతున్నాయి..? మాస్టర్ ప్లాన్, పట్టణ ప్రణాళిక ఫ్యూచర్ సిటీ ప్లానింగ్.. సిటీకి విఘాతం కలిగించే విధంగా.. రూల్స్ కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టి, వాటిని ప్రోత్సహిస్తున్న అధికారులు ఉంటే.. భవిష్యత్తులో భవనంలో ఉండేవారు అగ్ని ప్రమాదాల్లో చిక్కుకొని బలి కావాల్సిందేనా..? ఈ విషయంపై ఉన్నత స్థాయి అధికారులు దృష్టి సారించి, అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకొని, ఇలాంటి అక్రమ నిర్మాణాలను నిలువరించి, అక్రమ నిర్మాణ దారుడిపై చర్యలు తీసుకోవాలని స్థానిక జనం డిమాండ్ చేస్తున్నారు..

అసలు అక్రమ పద్ధతిలో కమర్షియల్ స్థలంలో రెసిడెన్షియల్ నిర్మాణ అనుమతులు ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి ఏసిపి విఠల్ ఎలా ఇచ్చారు..? ఈ వ్యవహారంపై రేపటి కథనంలో ఆధారాలతో మీ ముందుకు..

Latest News

సకల మంత్రాలకు మూలశక్తి.. గాయత్రి

జ్యేష్ట శుక్ల ఏకాదశి గాయత్రి జయంతి వేదమాత గాయత్రీదేవి మంత్రాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రవచించిన దినమైన జ్యేష్ట శుక్ల ఏకాదశి నాడు గాయత్రీ జయంతిని ఘనంగా జరుపుతారు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS