Wednesday, June 4, 2025
spot_img

పెద్దల సభకు కమల్ హాసన్

Must Read

ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ పార్లమెంట్‌లోని పెద్దల సభకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, ఎంఎన్ఎం ప్రకటించాయి. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదిరిన ఒడంబడిక ప్రకారం ఎంఎన్ఎం పార్టీకి తాజాగా రాజ్యసభ స్థానం కేటాయించారు.

తమిళనాడు, అస్సాంలలోని 8 ఎంపీ సీట్లకు వచ్చే నెల 19న ఎలక్షన్ జరగనుంది. ఇందులో 6 స్థానాలు తమిళనాడులో, 2 స్థానాలు అస్సాంలో ఉన్నాయి. తమిళనాడు శాసనసభలో డీఎంకే పార్టీకి 134 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాబట్టి ఈ పార్టీ 4 రాజ్యసభ సీట్లలో విజయం సాధించటం ఖాయం. ఈ నాలుగు స్థానాల్లో ఒక చోట కమల్ హాసన్‌ను గెలిపించుకోనుంది. ఆయన 2018లో ప్రారంభించిన ఎంఎన్ఎం పార్టీ కేంద్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామి. డీఎంకే కూడా ఆ అలయెన్స్‌లో కొనసాగుతోంది.

ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ 2024 సాధారణ ఎన్నికల్లో తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాల్లో, పుదుచ్చెరిలోని ఒక చోట డీఎంకే కూటమి తరఫున ప్రచారం చేసింది. అందుకు ప్రతిఫలంగా ఒక రాజ్యసభ సీటును పొందుతోంది. ఈ మేరకు ఇరు పక్షాల మధ్య ముందే ఒప్పందం కుదిరింది.

Latest News

మంత్రి మెప్పుకోసం చట్టాలు, నిబంధనలకు తిలోదకాలు

నారాయణ విద్యాసంస్థలకు దాసోహం అంటున్న అధికారులు ˜ ఒక్కడి కోసం ఒకే రోజులో పరిమిషన్‌.. !˜ విద్యా వ్యవస్థలో సాధ్యం కానిది ఇప్పుడు జరిగింది..˜ ఒక ప్రత్యేక...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS