Tuesday, October 21, 2025
spot_img

ఫైనల్‌కి వెళ్లేది ఎవరో?

Must Read

నేడు ముంబై, పంజాబ్ మధ్య పోటీ

ఐపీఎల్‌లో ఇవాళ (జూన్ 1న) క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై, పంజాబ్ పోటీపడనున్నాయి. ఈ రోజు గెలిస్తే ఫైనల్‌లోకి అడుగుపెట్టొచ్చు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కి చేరిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌కి ఈ మ్యాచ్‌ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే.. ఈ స్టేడియంలో ఈ టీమ్ రికార్డ్ ఏమాత్రం బాగలేదు. ఇక్కడ ఆడిన 5 సార్లూ ఓటమి తప్పలేదు. 2023 ఐపీఎల్ క్వాలిఫైయర్ 2లో గుజరాత్‌తో ఆడినప్పుడూ పరాజయమే పలకరించింది. ముంబై ఇండియన్స్ ఈ గ్రౌండ్‌లో చివరిసారిగా 2014లో విజయం సాధించింది. అంటే 11 ఏళ్లుగా ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదని అర్థం. ఈ ఫెయిల్యూర్స్‌కి బ్రేక్ వేయటం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి, కోచ్ మహేల జయవర్ధనేకి సవాల్‌గా నిలిచింది. కాబట్టి ఈ క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చావోరేవో అన్నట్లుగా పోరాడాలి.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This