Tuesday, July 1, 2025
spot_img

బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం

Must Read
  • జాకీ పెట్టిలేసినా బీఆర్‌ఎస్‌ లేవదు : బండిసంజయ్‌

రాష్ట్రంలో పాలన అదుపు తప్పిదని.. కాంగ్రెస్‌కు పాలన చేతకావడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ నేత రాజాసింగ్‌ కామెంట్స్‌పై బండి సంజయ్‌ స్పందించారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండు పార్టీల మధ్య రహస్య సమావేశాలు జరిగి ఉండవచ్చని చెప్పారు. రాజాసింగ్‌ చేసిన కామెంట్లను తాను చూడలేదని బండి సంజయ్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌లో బండి సంజయ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడారు. బీజేపీకి ఎవరితోనూ రహస్య ఎజెండాలు, సమావేశాలు ఉండవని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలు.. బీజేపీని అడిగే ఇచ్చారా అని ప్రశ్నించారు. పంటలు ఎండుతుంటే కాంగ్రెస్‌కు పట్టదా అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ను జాకీ పెట్టి లేపినా ఇక లేవదని విమర్శించారు. డిలీమిటేషన్‌పై ఎలాంటి నిర్ణయం జరగలేదని అన్నారు. ఒక వర్గం, ప్రాంతం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని తేల్చిచెప్పారు. కేంద్రం ప్రకటన చేయకముందే ప్రతిపక్షాలు హడావుడి చేస్తున్నాయని అన్నారు. హైదరాబాద్‌ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని బండి సంజయ్‌ ఆరోపించారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS