నిరుద్యోగులకు భారీ శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ssc) దాదాపు 14,582 కొలువుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో మొత్తం 37 రకాల నౌకరీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఈ గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగాల నియామకానికి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2025ను నిర్వహించనునంది. ఈ పోస్టులకు 2025 జులై 4 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. టయర్-1 పరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)ను జులై 9 నుంచి 11 తేదీల మధ్య నిర్వహించే అవకాశం ఉంది. టయర్-2 పరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)ను డిసెంబర్లో జరపనుంది. పూర్తి వివరాలకు ssc.gov.inను సందర్శించొచ్చు.