విజయవంతంగా ముగిసిన లాటరీ ప్రక్రియ
రంగారెడ్డి జిల్లా నార్సింగి అడ్రస్ కన్వెన్షన్ హాల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 24 నూతన బార్లకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి లాటరీ నిర్వహించారు. కమిషనర్ సి.హరికిరణ్ ఆధ్వర్యంలో బార్ల దరఖాస్తుదారుల సమక్షంలో జరిగిన ఈ డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని 24 బార్లకు ఏకంగా 3,525 అప్లికేషన్లు వచ్చాయి. డ్రాలో బార్ లైసెన్స్లను సొంతం చేసుకున్నవారికి అలాట్మెంట్ లెటర్లను అందజేశారు.