Friday, June 27, 2025
spot_img

చికెన్ షాప్ లో మ‌త్తుప‌దార్దాల‌ విక్రయాలు..

Must Read

నిందితుడి అరెస్ట్, కేసు నమోదు చేసిన ఎస్ఐ నర్సింహారావు

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్ నగర్లో గల ఎజెఆర్ చికెన్ షాప్ లో గ‌*జాయి విక్రయాలు జరుగుతున్నాయనే నమ్మదగిన సమాచారంతో మొయినాబాద్ పోలీసులు దాడి నిర్వహించారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ఎస్ఐ ఆర్.నరసింహరావు నేతృత్వంలో పోలీసులు బుధవారం షాప్ ను పూర్తి తనిఖీ చేయగా 2.5 కిలోల గ‌*జాయి దొరికింది. దీంతో పోలీస్ బృందం షాప్ లో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాగా చికెన్ షాప్ లో ఉన్న మహబూబ్ (25), అజీజ్ నగర్ లో ఉంటూ గ‌*జాయి విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, గ‌*జాయి సరఫరా వెనుక ఉన్న ముఠాను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టామని మొయినాబాద్ ఎస్ఐ నరసింహ రావు తెలిపారు. నిషేధిత గ‌*జాయి, డ్రగ్స్ సప్లయ్ చేసినా, అమ్మినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మొయినాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు హెచ్చరించారు.

Latest News

కోట్లు కొల్ల‌గొట్టిన కొంతం శ్రీనివాసులు

అధికారి హోదాలో ప్రభుత్వ భూములను ప్రైవేటుప‌రం అక్ర‌మార్కుల‌కు అండ‌గా ఉంటూ కోట్లు కొల్ల‌గొట్టిన వైనం కుటుంబ స‌భ్యులు, బినామీ పేర్ల‌తో కోట్ల‌లో అక్ర‌మాస్తులు ఏసీబీ, ఐటీ శాఖ అధికారులు స‌మ‌గ్రంగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS