Saturday, August 16, 2025
spot_img

విద్యాహక్కు చట్టం అమలుపై విచారణ

Must Read

విద్యాహక్కు చట్టం అమలుపై దాఖలైన పిల్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలని సామాజిక కార్యకర్త తాండవ యోగేశ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్‌టీఈ వచ్చి 16 ఏళ్లు గడుస్తున్నా విద్యార్థులకు అందుబాటులోకి రాలేదని తెలిపారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యాహక్కు చట్టం అమలులో ఉందని గుర్తుచేశారు. దీని ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. మరోవైపు గతేడాది అక్టోబర్‌లో విద్యాహక్కు చట్టంపై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తెస్తామని అందులో పేర్కొంది. దీని అమలుకు సంబంధించిన పురోగతిపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీజే ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS