Monday, June 2, 2025
spot_img

రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ‘ఏరువాక ఆగే’ పాట విడుదల

Must Read

అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన చిత్రం జగమెరిగిన సత్యం. అచ్చ విజయ భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహించారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని ఏప్రిల్18న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ మూవీ నుండి ఏరువాక ఆగే అనే సాంగ్ ను ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ నేపద్యంలో 1994 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తిరుపతి పాలే. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అచ్చ విజయ భాస్కర్ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. సురేష్ బొబ్బిలి అందించిన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన లభిస్తోంది.

ఈ సందర్భంగా నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. జగమెరిగిన సత్యం టైటిల్ బాగుంది. నేను విడుదల చేసిన ఏరువాక ఆగే సాంగ్ ఎమోషనల్ గా ఉంది. మంచి కథ కథనాలతో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ అందరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను అన్నారు. ఏప్రిల్ 18న ఈ సినిమాను అందరూ థియేటర్స్ లో చూసి కొత్త నటీనటులను ఎంకరేజ్ కోరుకుంటున్నట్లు తెలిపారు.

Latest News

డల్లాస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం అమెరికాలోని డల్లాస్‌లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS