Friday, June 27, 2025
spot_img

2025 ఐపీఎల్‌లో పంజాబ్‌ ఆరో విజయం

Must Read

2025 ఐపీఎల్‌లో పంజాబ్‌ ఆరో విజయం నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. చెన్నై నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ 19. 4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (72 పరుగులు), ప్రభ్‌ సిమ్రమన్‌ సింగ్‌ (54 పరుగులు) హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు. చివర్లో శశాంక్‌ సింగ్‌ (23) రాణించాడు. చెన్నై బౌలర్లలో పతీరణ, ఖలీల్‌ అహ్మద్‌ చెరో 2, నూర్‌ అహ్మద్‌, జడేజా తలో 1 వికెట్‌ దక్కించుకున్నాకు. సూపర్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన అయ్యర్‌కు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది. కాగా, తాజా విజయంతో పంజాబ్‌ ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఆరో విజయంతో (1 ఫలితం తేలలేదు) టాప్‌ 2లోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం పంజాబ్‌ 13 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఎనిమిదో ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్‌ రేస్‌ నుంచి నిష్క్రమించింది. కాగా, చెపాక్‌లో సీఎస్కేకు వరుసగా ఇది ఐదో ఓటమి. ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై జట్టు చెపాక్‌ మైదానంలో వరుసగా ఇన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన చెన్నై జట్టు 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటయ్యింది. చెన్నై బ్యాటర్లలో సామ్‌ కరన్‌ (88బీ 47 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదరగొట్టాడు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (32బీ 26 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. చాహల్‌కు హ్యాట్రిక్‌ దక్కింది. అర్ష్‌దీప్‌సింగ్‌ 2, యాన్సెన్‌ 2, ఒమర్జాయ్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌లు చెరో వికెట్‌ తీశారు గత మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ సమష్టి కృషి చేసింది. 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య 23 పరుగులకే ఔటవగా.. ప్రభు సిమ్రాన్‌ సింగ్‌ అర్ధ శతకంతో అదరగొట్టాడు. 36 బంతుల్లో 54 పరుగులు చేసి 5 ఫోర్లు, 3 సిక్సర్లతో రాణించాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ భారీ స్కోర్‌ చేసి మరోసారి తన విలువను చాటి చెప్పాడు. 41 బంతుల్లో 72 పరుగులు చేసి దుమ్మురేపాడు. 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాది విలువైన ఇన్నింగ్స్‌ శ్రేయస్‌ ఆడాడు. నేహాల్‌ వదెరా (5) నిరాశపర్చగా.. శశాంక్‌ సింగ్‌ 23 పరుగులతో జట్టుకు కావాల్సిన గెలుపు రన్స్‌ను సాధించాడు. సూర్యాన్ష్‌ హెగ్డే ఒక పరుగుకే ఔటవగా.. జోష్‌ ఇంగ్లీస్‌, మార్కో జెన్సన్‌ కొన్ని పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించారు.అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌లో బౌలర్లు కూడా ఓటముల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్లపై మొదట చేతులెత్తేసిన బౌలర్లు అనంతరం పట్టుసాధించినా కూడా చివరి వరకు కొనసాగించలేకపోయారు. ఖలీల్‌ అహ్మద్‌, మతీష పతిరణ రెండేసి వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, నూర్‌ అహ్మద్‌ ఒక్కొక్క వికెట్‌ పడగొట్టారు. బౌలర్లకు తోడు క్యాచ్‌లు వదిలిపెట్టడం జట్టుకు పరాభవం పట్టింది. హ్యాట్రిక్‌ ఓటమితో చెన్నై సూపర్‌ కింగ్స్‌ పరాజయాల సంఖ్య 8కి చేరాయి. ఆడిన 10 మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిచి 8 మ్యాచ్‌లను ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆఖరున నిలిచింది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ అవకాశాలను కోల్పోయిన ఎల్లో ఆర్మీ మిగతా రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే కొంత పరువు నిలబెట్టుకుంది. లేకపోతే అత్యంత ఫెయిల్యూర్‌ జట్టుగా ముద్ర వేసుకుంటుంది. నిలకడగా ఆడుతూ ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపర్చుకుంటున్న పంజాబ్‌ కింగ్స్‌ మరో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సొంతం చేసుకోగా.. ఐదు ఓటములను చవిచూసింది. పంజాబ్‌ ప్రదర్శన ఇదే స్థాయిలో కొనసాగితే సీజన్‌లో ముందడుగు వేసే అవకాశం ఉంది.

Latest News

2.2 లక్షల ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కారు టోకరా: బీఆర్ఎస్

హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్‌ నైజమన్నది లోకవిదితం.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు, వారిని నిట్టనిలువునా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS