Tuesday, October 21, 2025
spot_img

ముంబైపై ‘పంజా’బ్ పైచేయి

Must Read

ఐపీఎల్‌-18లో పంజాబ్ కింగ్స్ జట్టు పదేళ్ల గ్యాప్ తర్వాత ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై అయింది. అదే ఉత్సాహంతో క్వాలిఫయర్ ఆడే ఛాన్స్‌నూ కొట్టేసి ఏకంగా టాప్-2లో బెర్త్ ఖరారు చేసుకుంది. లేటెస్ట్‌గా ముంబై ఇండియన్స్‌పై విక్టరీతో 19 పాయింట్లు సాధించింది. తద్వారా టాప్‌లోకి వచ్చేసింది. సోమవారం (మే 26న) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ని ఓడించింది. తొలుత ముంబై ఇండియన్స్ 7 వికెట్లు కోల్పోయి 184 రన్నులు చేసింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలోనే టార్గెట్ చేరుకుంది. జోష్ ఇంగ్లిష్ 42 బాల్స్ ఆడి 73 రన్నులు చేశాడు. తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో ముంబై నాలుగో స్థానంలో ఉండిపోయింది. ఈ రోజు మంగళవారం రాత్రి ఏడున్నరకు చివరి లీగ్ మ్యాచ్ లక్నో, బెంగళూర్ మధ్య జరగనుంది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This