Monday, October 20, 2025
spot_img

పట్టువిడుపులతో పచ్చని సంసారం

Must Read

మూడు ముళ్లు.. ఏడడుగులతో వివాహ బంధం ఏర్పాటుచేసుకున్నాక దంపతులు సంసార జీవితాన్ని సాఫీగా, సంతోషంగా సాగించాలి. జీవన ప్రస్థానంలో కొన్ని సార్లు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు, ఆలోచనల్లో వ్యత్యాసాలు రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు, బంధుత్వ భేదాలు ఏర్పడొచ్చు. పలుమార్లు పరస్పర అవగాహన లోపం తలెత్తొచ్చు. ఇవన్నీ కలిసి కూర్చొని చర్చించుకుంటే దూరమయ్యే మామూలు సమస్యలే. ఇంత చిన్న లాజిక్‌ని చాలా మంది మిస్ అవుతున్నారు. బూతద్దం వేసి చూస్తున్నారు. పనికిరాని పంతాలకు పోతున్నారు. అంతరాన్ని పెంచుకొని దూరమవుతున్నారు. దంపతుల అహం వల్ల వారి పిల్లల బంగారు భవితవ్యం ఆగం అవుతోంది. గతాన్ని చేదు మాత్రలా మింగేసి భవిష్యత్తు కోసం ఆలోచిస్తే ఫలితం మహాద్భుతంగా ఉంటుంది. పెళ్లంటే నూరేళ్లు పంట అంటూ జీవిస్తే కలహాల కాపురం పచ్చని సంసారంలా మారుతుంది.

  • బొల్లెద్దు వెంకటరత్నం

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This