Wednesday, June 4, 2025
spot_img

ఫైనల్‌కి వెళ్లేది ఎవరో?

Must Read

నేడు ముంబై, పంజాబ్ మధ్య పోటీ

ఐపీఎల్‌లో ఇవాళ (జూన్ 1న) క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై, పంజాబ్ పోటీపడనున్నాయి. ఈ రోజు గెలిస్తే ఫైనల్‌లోకి అడుగుపెట్టొచ్చు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కి చేరిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌కి ఈ మ్యాచ్‌ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే.. ఈ స్టేడియంలో ఈ టీమ్ రికార్డ్ ఏమాత్రం బాగలేదు. ఇక్కడ ఆడిన 5 సార్లూ ఓటమి తప్పలేదు. 2023 ఐపీఎల్ క్వాలిఫైయర్ 2లో గుజరాత్‌తో ఆడినప్పుడూ పరాజయమే పలకరించింది. ముంబై ఇండియన్స్ ఈ గ్రౌండ్‌లో చివరిసారిగా 2014లో విజయం సాధించింది. అంటే 11 ఏళ్లుగా ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదని అర్థం. ఈ ఫెయిల్యూర్స్‌కి బ్రేక్ వేయటం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి, కోచ్ మహేల జయవర్ధనేకి సవాల్‌గా నిలిచింది. కాబట్టి ఈ క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చావోరేవో అన్నట్లుగా పోరాడాలి.

Latest News

నాట్స్ ప్రెసిడెంట్‌గా శ్రీహరి మందడి

యూఎస్‌లో అతిపెద్ద తెలుగు అసోసియేషన్.. ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ.. నాట్స్(NATS). ఈ సంఘానికి కొత్త అధ్యక్షుడిగా శ్రీహరి మందడి ప్రమాణ స్వీకారం చేశారు. న్యూజెర్సీలో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS