Saturday, June 7, 2025
spot_img

పేరు మార్చుకున్న మైరాన్

Must Read

మైరాన్ చెరుబిక్ ఫామ్స్ నుండి చెరుబిక్ గా పేరు మార్పు

‍‍‍యాడేసిన‌ గొంగ‌ళి ఆడే

  • లంచాల మ‌త్తులో పంచాయితీ రాజ్‌
  • పూర్తీ అక్ర‌మ‌మ‌ని తేలినా నో రియాక్ష‌న్‌
  • విధుల‌ను మ‌రిచిన షాబాద్‌ ఎంపీవో
  • షాబాద్‌లోని తిమ్మ‌రెడ్డిగూడ గ్రామంలో వైనం

గుమ్మ‌డికాయ‌ల‌ దొంగ ఎవ‌రు అంటే.. బుజాలు త‌డిమిన‌ట్లు మాయా మైరాన్ అక్ర‌మ‌మ‌న‌గానే చెరుబిక్ అని పేరుకుటున్నారు.. త‌ప్పు బ‌య‌ట ప‌డింది కాబ‌ట్టే పేరు మార్చిన‌ట్టు క‌నిపిస్తోంది. అధికారులకు అనుకూలంగా ఉండ‌టానికి ఆ పేరుమీద ఉన్న వెంచ‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలుపుతూ మైరాన్ చెరుబిక్ నుంచి చెరుబిక్ అనే పేరు మార్చిన‌ట్టు తెలుస్తోంది. ఇదివ‌ర‌కు ఆదాబ్ హైద‌రాబాద్‌లో వ‌చ్చిన‌ క‌థ‌నానికి అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలుప‌డానికే ఈ చ‌ర్య‌లుగా క‌నిపిస్తోంది.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండ‌లంలోని తిమ్మ‌రెడ్డిగూడ‌లో స్థితి ఇదీ.

నో రీయాక్ష‌న్ ..
అధికారులు స‌క్ర‌మంగా ఉంటే ప‌ల్లెలు, ప్ర‌జ‌లు, అంతా సుభిక్షంగా ఉంటారు. అధికారులే అక్ర‌మాల‌కు పాల్ప‌డితే ప‌ల్లెలు ప్ర‌జ‌లు అంతా అక్ర‌మ దారిలోనే పోతుంది. మైరాన్ చెరుబిక్ వెంచ‌ర్ అంతా అక్ర‌మ‌ని తేలినా సెక్ర‌ట‌రీ, ఎంపీవో, డీఎల్‌పీవో వ‌ర‌కు నిమ్మ‌కునీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెల‌స్తోంది. రాజ‌కీయ నాయ‌కుల‌ అండ‌దండ‌ల‌తోనే అధికారులు ఈ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు స్థానికులు అంటున్నారు. ఎలాంటి అనుమ‌తులు లేకుండా క‌నీసం నాలా చేయ‌కుండా గ‌జాల్లో భూముల‌ను అమ్ముకుంటూ గుంట‌ల్లో రిజిస్ట్రేష‌న్లు చేస్తున్నారు. అలా ప్ర‌భుత్వానికి కూడా గండికొడుతున్న‌ట్లు తెలిసినా అధికారులు చ‌ర్య‌లు తీసుకోలేక పోతున్నారు. ఇదంతా అమ్యామ్యాల మ‌త్తులోనే ఉంటూ ప్ర‌భుత్వం అన్నా, పై అధికారులు అన్నా, క‌నీసం క‌లెక్ట‌ర్ అన్న భ‌యం లేకుండా పోయింది.

ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల్సిన అధికారులే దొంగ‌ల‌కు వ‌త్తాసుప‌లికితే.. ఇక ప్ర‌జ‌ల‌కు న్యాయం ఎవ‌రూ చేస్తారు.. అక్ర‌మార్కుల‌కు వ‌త్తాసు ప‌లుకుతున్న ఇలాంటి అవినీతి అధికారుల‌పై వెంట‌నే శాఖ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోని, మైరాన్ చెరుబిక్ వెంచ‌ర్‌పై స‌మ‌గ్రంగా ద‌ర్యాప్తు చేసి, నిజానిజాలు నిగ్గుతేల్చాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు..

మైరాన్ చెరుబిక్ వెంచ‌ర్ చేస్తున్న అక్ర‌మాల‌పై మ‌రో క‌థ‌నం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైద‌రాబాద్‌.. మా అక్ష‌రం.. అవినీతిపై అస్త్రం..

ఎంపీవో శ్రీనివాస్

మేము ఏం చేయాలో మాకు తెలుసు : షాబాద్ ఎంపీవో శ్రీ‌నివాస్
మేము ఏం చేయాలో మాకు తెలుసు మీరు మాకు చెప్పాల్స‌న ప‌నిలేదు.. ఇదండీ షాబాద్ ఎంపీవో శ్రీ‌నివాస్ ప‌నితీరు.. మైరాన్ వెంచ‌ర్‌పై చ‌ర్య‌లు గురించి చ‌ర్చిస్తే చాలు ఎంపీవో మండిపాటుకు గుర‌వుతున్నారు. ఆదాబ్ హైద‌రాబాద్ వివ‌ర‌ణ కోర‌గా డీఎల్‌పీవో వ‌చ్చిన‌ట్టు ఉన్నాడని ఒక‌సారి, నోటీసులు ఇచ్చాడ‌ని ఒక‌సారి, కాదు కాదు నేను సెల‌వులో ఉన్నాన‌ని ఒక‌సారి వారు ఎలా స‌మాదానం చెప్పాలో కూడా తెలియ‌ని ప‌రిస్థితిక‌నిపిస్తోంది. చివ‌రిగా బోర్డులో పేరు మార్చ‌మ‌ని చెప్పిందే ఎంపీవో అని స్థానికులు చెబుతున్నారు.

Latest News

కోహ్లీని అరెస్ట్ చేయాలి

ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్‌ బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాట సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఆ జట్టులోని స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీని అరెస్ట్‌ చేయాలని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS