Monday, October 27, 2025
spot_img

జ్యూనికార్న్ సదస్సు 2025 విజయవంతం

Must Read

టెక్సాస్ స్టేట్ యూనివర్సిటీ జరిపిన ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్ఎఫ్) గ్లోబల్ జ్యూనికార్న్ అండ్ ఏఐ సదస్సు 2025లో మన దేశ గ్రామీణ ప్రాంతాల పిల్లలు ప్రతిభను చాటుకున్నారు. ఈ ఇంటర్నేషనల్ సమ్మిట్‌లో ఇండియన్ స్టూడెంట్స్ 50 మంది తమ ప్రాజెక్టులను ప్రదర్శించి ఔరా అనిపించుకున్నారు. సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సోషల్ డెవలప్‌మెంట్ తదితర అంశాల్లో వారు రూపకల్పన చేసిన ఆవిష్కరణలు అంతర్జాతీయంగా అభినందనలను సొంతం చేసుకున్నాయి. ఈ సదస్సు ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఐఎస్ఎఫ్ ఫౌండర్ డాక్టర్ జేఏ చౌదరి, ఐఎస్ఎఫ్ యూఎస్ఏ చీఫ్ అట్లూరి సమన్వయంతో సక్సెస్ చేశారు

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This