Monday, October 27, 2025
spot_img

భక్తిని బిజినెస్‌గా మార్చిన ఘనుడు

Must Read

రూ.2.15 కోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

గతేడాది జనవరిలో అయోధ్యలో జరిగిన బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఓ ఘనుడు భక్తుల విశ్వాసాన్ని బిజినెస్‌గా మార్చేశాడు. రామాలయ ప్రసాదం పంపిణీ పేరుచెప్పి లక్షలాది మంది భక్తులను మోసం చేశాడు. రూ.51కే ప్రసాదాన్ని ఇంటికి పంపిస్తామని నమ్మబలికాడు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకున్నాడు. దీంతో 6 లక్షల మందికి పైగా భక్తులు ఆన్‌లైన్ పేమెంట్లు చేశారు. దీంతో రూ.2.15 కోట్లు జమయ్యాయి. కానీ ఎవరికీ ప్రసాదం రాలేదు. మోసపోయామని గ్రహించిన బాధితులు అయోధ్య సైబర్ పోలీసులకు చెప్పటంతో వారు కేసు బుక్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఆశిష్ అనే నిందితుణ్ని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి రూ.2.15 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ సొమ్మును బాధితులకు తిరిగి ఇచ్చేశారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This